News July 28, 2024
మా శత్రువును సమూలంగా నాశనం చేస్తాం: ఉత్తర కొరియా

అధినేత కిమ్ జాంగ్ ఆదేశిస్తే శత్రువుల్ని తుడిచిపెట్టేస్తామని నార్త్ కొరియా సైన్యం తెలిపింది. దక్షిణ కొరియాతో యుద్ధానికి 71 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించింది. ‘అమెరికాలో ఎవరు గెలిచినా ఆ దేశంతో మా సంబంధాల్లో మార్పు ఉండదు. దక్షిణ కొరియా, US కలిసి అణుయుద్ధాన్ని తీసుకురావాలని చూస్తున్నాయి. మమ్మల్ని కవ్విస్తే పూర్తిగా నాశనం చేస్తాం’ అని సైన్యం ప్రకటించినట్లు KCNA వార్తాసంస్థ పేర్కొంది.
Similar News
News November 28, 2025
గొర్రెల్లో బొబ్బ రోగం(అమ్మతల్లి) ఎలా గుర్తించాలి?

ఇది ఏడాదిలో ఏ కాలంలోనైనా, ఏ ప్రాంతాల్లో గొర్రెలకైనా సోకే అంటువ్యాధి. ఇది సోకిన గొర్రెలు ఆకస్మికంగా నీరసంగా మారతాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగి కళ్లు ఎర్రబడి నీరు కారతాయి. వ్యాధి సోకిన 1,2 రోజుల్లో గొర్రె శరీర భాగాలపై దద్దుర్లు ఏర్పడి క్రమేణా పెద్దవై, బొబ్బలుగా మారి చీము పట్టి నలుపు రంగులోకి మారతాయి. వ్యాధి తీవ్రత బట్టి సుమారు 20-30% గొర్రెలు మరణిస్తాయి. ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స అందించాలి.
News November 28, 2025
తిరుమల శ్రీవారి పుష్పాలను ఏం చేస్తారో తెలుసా?

తిరుమల శ్రీవారి సేవ కోసం రోజుకు కొన్ని వందల కిలోల పూలు వాడుతారు. మరి వాటిని ఏం చేస్తారో మీకు తెలుసా? పూజ తర్వాత వాటిని బయట పడేయరు. తిరుపతికి తరలిస్తారు. అక్కడ శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనంలోని పూల ప్రాసెసింగ్ యూనిట్కు పంపుతారు. ఈ యూనిట్లో ఈ పూల నుంచి పరిమళభరితమైన అగరబత్తులు, ఇతర సుగంధ ద్రవ్యాలను తయారుచేస్తారు. తద్వారా పూల పవిత్రతను కాపాడుతూనే, వాటిని ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మారుస్తారు.
News November 28, 2025
2026 సెలవుల జాబితా విడుదల

కేంద్రం 2026 సంవత్సరానికి అధికారిక <


