News December 24, 2024

నో డిటెన్షన్ పాలసీని కొనసాగిస్తాం: తమిళనాడు మంత్రి

image

కేంద్రం రద్దు చేసిన ‘<<14964843>>నో డిటెన్షన్ పాలసీ<<>>’ని తమ రాష్ట్రంలో 8వ తరగతి వరకు కొనసాగిస్తామని తమిళనాడు మంత్రి అన్బిల్‌ స్పష్టం చేశారు. పరీక్షల్లో విఫలమైతే 5, 8 తరగతుల విద్యార్థులను అదే తరగతిలో కొనసాగించాలని కేంద్రం సూచించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో పేద కుటుంబాల పిల్లల చదువుకు ఇబ్బందులు ఎదురవుతాయని అన్బిల్‌ అన్నారు. ఈ పాలసీపై TG ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం.

Similar News

News October 27, 2025

7,565 కానిస్టేబుల్ పోస్టులు.. 4 రోజులే గడువు

image

ఇంటర్ అర్హతతో 7,565 ఢిల్లీ పోలీస్ సర్వీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులకు SSC నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తు గడువు ఈనెల 31తో ముగియనుంది. 18-25 ఏళ్ల వయసువారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. రాతపరీక్ష, PE&MT, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. DEC/JANలో రాత పరీక్ష నిర్వహిస్తారు. పేస్కేల్ రూ.21,700-రూ.69,100 వరకు ఉంటుంది. వెబ్‌సైట్: <>https://ssc.gov.in/<<>>

News October 27, 2025

బాదం నూనెతో ఎన్నో లాభాలు

image

బాదం నూనెలో మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు, చర్మ సంరక్షణకు తోడ్పడతాయంటున్నారు నిపుణులు. బాదం, ఆముదం, ఆలివ్ నూనెల్ని సమపాళ్లలో తీసుకొని మాడుకు మసాజ్ చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉండటంతోపాటు ఒత్తుగా పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే తరచూ బాదం నూనెతో మసాజ్ చేస్తే డార్క్​ సర్కిల్స్, ముఖంపై ముడతలు, గీతలు, మచ్చలు తగ్గి తేమ అందుతుందని నిపుణులు చెబుతున్నారు. <<-se>>#skincare<<>>

News October 27, 2025

వద్దన్నా.. బర్లీ పొగాకు సాగు చేస్తున్నారు

image

AP: సరైన ధర, కొనుగోలు లేనందున బర్లీ పొగాకు సాగుపై ప్రభుత్వం ఆంక్షలు విధించినా రైతులు వెనక్కు తగ్గడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సుమారు 21వేల ఎకరాల్లో ఈ పంటను సాగు చేశారు. ప్రకాశం జిల్లాలో 11,400 ఎకరాల్లో, కర్నూలులో 4 వేలు, పల్నాడు జిల్లాలో 4,600 ఎకరాల్లో.. మరో 7 జిల్లాల్లో కొద్ది విస్తీర్ణంలో బర్లీ పొగాకును సాగు చేస్తున్నట్లు వెల్లడైంది. రైతులు ఏ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారో అధికారులకు కూడా తెలియదు.