News February 24, 2025

ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటాం: పెద్దిరెడ్డి

image

AP: అసెంబ్లీలో వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడిని అడిగామని MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అయితే సానుకూల స్పందన రాలేదని చెప్పారు. ఈ విషయంపై కోర్టును కూడా ఆశ్రయించామన్నారు. ప్రతిపక్ష హోదా కల్పించకపోయినా క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఇవాళ సభకు హాజరైన YCP నేతలు గవర్నర్ ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేసిన విషయం తెలిసిందే.

Similar News

News December 19, 2025

దీన్‌దయాల్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

image

దీన్‌దయాల్ పోర్ట్ అథారిటీ 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 15వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు కాపీ, డాక్యుమెంట్స్‌ను JAN 27వరకు స్పీడ్ పోస్ట్ చేయాలి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE, B.Tech, B.LSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://www.deendayalport.gov.in/

News December 19, 2025

ఆయిల్ పామ్ సాగులో ఇవి కీలకం

image

ఆయిల్ పామ్ సాగుకు నీటి సదుపాయం కీలకం. 2 అంగుళాల బోర్‌వెల్ ఉంటే మైక్రోఇరిగేషన్ ద్వారా రోజూ 2,3 గంటలు.. వేసవిలో 4,5 గంటలు నీరివ్వాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి నిపుణుల సూచనలతో ఎరువులు తప్పక వేయాలి. పంట దిగుబడికి ఫలదీకరణం కీలకం. అందుకే మొక్క నాటిన ఏడాదిన్నర నుంచి మూడేళ్ల వరకు వచ్చే పొత్తులను తీసేయాలి. దీని వల్ల మొక్క మాను బాగా వృద్ధిచెందుతుంది. భవిష్యత్తులో గెలలు నిండుగా వచ్చి బరువు పెరుగుతాయి.

News December 19, 2025

మద్దతు ధరతో కందులు, మినుములు, పెసర కొనుగోలు

image

AP: రాష్ట్రంలో పప్పు ధాన్యాలు పండించే రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మద్దతు ధరపై(ఖరీఫ్ 2025-26) 1,16,690 మె.టన్నుల కందులు, 28,440 మె.టన్నుల మినుములు, 903 మె.టన్నుల పెసర కొనుగోలుకు అనుమతిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ లేఖ రాశారు. దీంతో క్వింటా కందులకు దాదాపు రూ.8000, మినుములకు రూ.8,110, పెసరకు రూ.8,768 అందనుంది.