News July 7, 2024
గుజరాత్లో BJPని ఓడిస్తాం.. రాస్కోండి: రాహుల్ గాంధీ
అయోధ్య తరహాలోనే గుజరాత్లోనూ బీజేపీని ఓడించి తీరుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. అహ్మదాబాద్లో కాంగ్రెస్ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. ‘గుజరాత్లో మోదీని, బీజేపీని కాంగ్రెస్ ఓడిస్తుంది. కావాలంటే రాసి పెట్టుకోండి. ఇక్కడి నుంచే కాంగ్రెస్ కొత్త శకాన్ని మొదలుపెడుతుంది. గుజరాత్ వజ్రాల పరిశ్రమ కష్టాలే తెలుసుకోలేని మనిషి, రాష్ట్ర ప్రజలకు మాత్రం ఏం చేస్తారు?’ అని ప్రశ్నించారు.
Similar News
News October 14, 2024
ఈ జిల్లాలపై తుఫాను ప్రభావం ఎక్కువ: మంత్రి నారాయణ
AP: చెన్నై-నెల్లూరు మధ్య ఈనెల 17న తుఫాను తీరం దాటే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. తుఫాను పరిస్థితులు, ముందస్తు జాగ్రత్తలపై అధికారులతో సమీక్షించారు. అన్నమయ్య, కడప, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, TRPT, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులను అప్రమత్తం చేశామన్నారు. అధికారులు ఇచ్చే సూచనలను ప్రజలు పాటించాలని కోరారు.
News October 14, 2024
నటి కారుకు యాక్సిడెంట్.. తీవ్ర గాయాలు
బుల్లితెర నటి శ్రీవాణి ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమె నుదుటి మీద తీవ్ర గాయం కావడంతో పాటు చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది. ప్రస్తుతం గుంటూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆమె భర్త విక్రమాదిత్య వెల్లడించారు. 3రోజుల క్రితం కుటుంబంతో కలిసి చీరాల బీచ్కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. శ్రీవాణి పలు సీరియల్స్, టీవీ షోల్లోనూ ఫ్యాన్స్ను ఎంటర్టైన్ చేస్తుంటారు.
News October 14, 2024
కులగణనపై ఈనెల 24 నుంచి అభిప్రాయ సేకరణ
TG: కులగణనపై అభిప్రాయాలు సేకరించేందుకు ఉమ్మడి జిల్లాల్లో పర్యటించాలని బీసీ కమిషన్ నిర్ణయించింది. కులగణన కార్యాచరణపై ఇవాళ తొలిసారి సమావేశమైంది. ప్రణాళిక శాఖతో కలిసి కులగణన చేయాలని నిర్ణయించింది. ఈనెల 24 నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటించి, వివిధ వర్గాల అభిప్రాయాలను తీసుకోనుంది. వాటిని అధ్యయనం చేసిన అనంతరం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించనుంది.