News March 3, 2025

3 రాజధానుల విధానంపై చర్చించి చెబుతాం: బొత్స

image

AP: రాష్ట్రంలో మూడు రాజధానుల అంశంపై YCP సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మూడు రాజధానులనేది ఆ రోజుకు మా విధానం. దానిపై ఇప్పుడు మా విధానం ఏంటనేది పార్టీలో చర్చించి చెబుతాం. అమరావతిని శాసన రాజధాని చేద్దామని అనుకున్నాం. అమరావతి శ్మశానంలా ఉందని నేను చెప్పింది వాస్తవమే. ఆరేళ్ల క్రితం అప్పటి సందర్భం మేరకు అలా మాట్లాడాను’ అని బొత్స తెలిపారు.

Similar News

News March 4, 2025

రాత్రిపూట నేలపై పడుకుంటే..

image

వేసవి వచ్చేసింది. ఉక్కబోత అల్లాడించే ఈ కాలంలో పరుపు నుంచి కూడా వేడి వస్తుంటుంది. అసలే రోజంతా పనులతో అలసిపోయిన శరీరం కునుకు తీసేందుకు పరుపుపై వాలగానే ఏదో అసౌకర్యం. అలాంటప్పుడు చక్కగా నేలపై నిద్రపోవడం చాలా మంచిదంటున్నారు జీవనశైలి నిపుణులు. చల్లటి నేలపై మంచి నిద్రే కాక ఒళ్లు నొప్పులకూ ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. నేలపై నిద్రను హాయిగా ఆస్వాదించాలని సూచిస్తున్నారు.

News March 4, 2025

క్రికెట్ అంటే తెలియనివాళ్లు ఇలా మాట్లాడటం విడ్డూరం: భజ్జీ

image

రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ బాడీ షేమింగ్ కామెంట్స్ దురదృష్టకరమని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నారు. క్రికెట్ తెలియనివారు కూడా ఇలా మాట్లాడటం విడ్డూరమన్నారు. క్రీడాకారులకూ ఎమోషన్స్, సెంటిమెంట్లు ఉంటాయని, ఇలాంటి కామెంట్స్ ఎంత బాధిస్తాయో తెలుసుకోవాలని హితవు పలికారు. రోహిత్ అద్భుతమైన ప్లేయర్‌ అని, గొప్ప నాయకుడని భజ్జీ కొనియాడారు.

News March 4, 2025

ఫస్ట్ క్లాస్ మాజీ క్రికెటర్ మృతి

image

ముంబై లెజెండరీ స్పిన్నర్ పద్మాకర్ శివాల్కర్(84) కన్నుమూశారు. వృద్ధాప్యంతో ఆయన తుది శ్వాస విడిచారు. 124 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఆయన 589 వికెట్లు పడగొట్టారు. పదకొండు సార్లు 10 వికెట్ల ఘనత సాధించారు. 12 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడిన పద్మాకర్ 16 వికెట్లు తీశారు. 2017లో సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు.

error: Content is protected !!