News September 12, 2025

స్టీల్ ప్లాంట్‌ను కాపాడేందుకు ఏమైనా చేస్తాం: బొత్స

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు తాము దేనికైనా సిద్ధమని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణ పూర్తిగా నిలిచిపోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ‘సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తున్నారు. 32 విభాగాలను ఔట్‌సోర్సింగ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. రాష్ట్రంలో అన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఉద్ధరిస్తున్నట్లు చూపుతున్నారు’ అని బొత్స మండిపడ్డారు.

Similar News

News September 12, 2025

దేశంలో సీనియర్ మోస్ట్ లీడర్ నేనే: చంద్రబాబు

image

AP: 2028 నాటికి తన 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తవుతుందని చంద్రబాబు Way2News కాన్‌క్లేవ్‌లో అన్నారు. ‘పేదలను నిరంతరం ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. నేను 45 ఏళ్లుగా కష్టపడుతున్నాను. దేశంలో సీనియర్ మోస్ట్ లీడర్ నేనే. దేశం ముందుకెళ్లడానికి ఒక సుస్థిర ప్రభుత్వం రావాలి. సరైన సమయంలో సరైన నాయకుడు ఉన్నారంటే అది మోదీ గారే. తెలుగుజాతి అన్నింటిలో నంబర్ వన్‌గా ఉండాలన్నదే నా ఆకాంక్ష’ అని వ్యాఖ్యానించారు.

News September 12, 2025

ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.. ప్రజలకు సీఎం పిలుపు

image

AP: ప్రజలు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘పోషకాహారం తినాలి. రోజూ గంట వ్యాయామం చేయాలి. రాత్రి వేళల్లో వెంటనే నిద్రపోవాలి. నా కుటుంబానికి హెరిటేజ్ ద్వారా ఆదాయం వస్తుంది. అందుకే నాకు ఎలాంటి టెన్షన్ లేదు. పూర్తి దృష్టి ప్రజలపైనే ఉంది. రాత్రి వేళ ప్రశాంతంగా నిద్ర పడుతుంది. P-4తో పేదరికం లేని సమాజాన్ని తయారు చేయడం నా జీవిత ఆశయం’ అని వే2న్యూస్ కాన్‌క్లేవ్‌లో పేర్కొన్నారు.

News September 12, 2025

2026 నాటికి క్వాంటమ్ వ్యాలీ పూర్తి: చంద్రబాబు

image

AP: తెలుగుజాతి అన్నింట్లో నం.1గా ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని Way2News Conclaveలో CM చంద్రబాబు పేర్కొన్నారు. ‘2026 నాటికి అమరావతి క్వాంటమ్ వ్యాలీ పూర్తవుతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ అందిస్తామని చాలా సంస్థలు ముందుకొస్తున్నాయి. ప్రపంచానికి మనం క్వాంటమ్ కంప్యూటర్స్ సరఫరా చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో అన్నీ సాధ్యమే. మనమూ ప్రపంచానికి పెద్ద పెద్ద ఉత్పత్తులను సరఫరా చేసే పరిస్థితి వస్తుంది’ అని తెలిపారు.