News June 30, 2024

కొంచెం ఆలస్యమైనా ఉచిత ప్రయాణ హామీ నెరవేరుస్తాం: మంత్రి రాంప్రసాద్

image

AP: RTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కర్ణాటక, తెలంగాణలో క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్రంలో అమలు చేస్తామని మంత్రి రాంప్రసాద్ తెలిపారు. ‘కొంచెం ఆలస్యమైనా ఇచ్చిన హామీని నెరవేరుస్తాం. జగన్ హయాంలో మంత్రుల మాదిరి మేం గంగిరెద్దుల్లా పనిచేయం. మంత్రులకు చంద్రబాబు స్వేచ్ఛనిచ్చారు. పెద్దిరెడ్డి కుటుంబం మైనింగ్, ఇసుక రంగాల్లో అవినీతి చేసింది. ప్రజల సొమ్ము తిన్నవారిపై చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.

Similar News

News November 28, 2025

BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో భారీగా ఉద్యోగాలు

image

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్‌లో వివిధ జోన్లలో 110 బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్/డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సేల్స్, మార్కెటింగ్ విభాగంలో పని అనుభవం ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తును ఇ- మెయిల్ ద్వారా careers@bobcaps.inకు పంపాలి. వెబ్‌సైట్: https://www.bobcaps.in/

News November 28, 2025

ఈ పురుగు యమ డేంజర్.. కుడితే అంతే..

image

AP: రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నల్లి తరహా ఉండే ఈ చిన్న పురుగు ఓరియంటియా సట్సుగముషి అనే బ్యాక్టీరియా రూపం. ఇది కుడితే చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. వారం తర్వాత జ్వరం, జలుబు, వణుకు, నీరసం, ఊపిరితిత్తుల సమస్యలు కనిపిస్తాయి. సకాలంలో వైద్యులను సంప్రదించకుంటే ప్లేట్‌లెట్స్ పడిపోవడం, మెదడు, తీవ్ర శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నెముక ఇన్‌ఫెక్షన్ సోకుతాయి.

News November 28, 2025

వ్యాధులు, ఆర్థిక ఇబ్బందులతో ఢిల్లీ ప్రజల అగచాట్లు

image

ఢిల్లీలో తీవ్రమైన కాలుష్యానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 80%పైన పౌరులు దగ్గు, అలసట, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నట్లు ఓ సర్వే వెల్లడించింది. ‘గత ఏడాదిలో 68.3% మంది కాలుష్య సంబంధిత వ్యాధులతో చికిత్స తీసుకుంటున్నారు. 79.8% మంది వేరే ప్రాంతాలకు వలస వెళ్లడానికి ఆలోచిస్తున్నారు. గృహ ఖర్చులు పెరిగాయని 85.3% మంది తెలిపారు. 41.6% తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’ అని తేలింది.