News June 30, 2024
కొంచెం ఆలస్యమైనా ఉచిత ప్రయాణ హామీ నెరవేరుస్తాం: మంత్రి రాంప్రసాద్

AP: RTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కర్ణాటక, తెలంగాణలో క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్రంలో అమలు చేస్తామని మంత్రి రాంప్రసాద్ తెలిపారు. ‘కొంచెం ఆలస్యమైనా ఇచ్చిన హామీని నెరవేరుస్తాం. జగన్ హయాంలో మంత్రుల మాదిరి మేం గంగిరెద్దుల్లా పనిచేయం. మంత్రులకు చంద్రబాబు స్వేచ్ఛనిచ్చారు. పెద్దిరెడ్డి కుటుంబం మైనింగ్, ఇసుక రంగాల్లో అవినీతి చేసింది. ప్రజల సొమ్ము తిన్నవారిపై చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.
Similar News
News December 5, 2025
యూరియాకు ఇవి ప్రత్యామ్నాయం

యూరియా కొరతను అధిగమించేలా ప్రస్తుతం మార్కెట్లో పంటపై పిచికారీ చేసే అనేక ఎరువులు అందుబాటులోకి వచ్చాయి. నానో యూరియా, నానో DAP, నీటిలో కలిపి పిచికారీ చేసే 19:19:19, 20:20:20, కాంప్లెక్స్ ఎరువులు, అధిక సాంద్రత కలిగిన 13-0-45(HD), ద్రవరూప నత్రజని ఎరువు వంటివి అందుబాటులో ఉన్నాయి. దుక్కిలో సిఫారసుల మేరకు కాంప్లెక్స్ ఎరువులను వేసుకొని, పైరుపై పిచికారీ చేసే ఎరువులను స్ప్రే చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.
News December 5, 2025
దీపం కొండెక్కితే..?

దీపం కొండెక్కిన తర్వాత ఉప్పును పారే జలంలో నిమజ్జనం చేయాలి. వత్తులను దాచిపెట్టుకోవాలి. ప్రమిదలను శుభ్రం చేసుకొని మళ్లీ వాడొచ్చు. నిమజ్జనం సాధ్యం కాకపోతే నీళ్లలో వేయాలి. శుక్రవారం దీపారాధన చేస్తే శనివారం ఈ పరిహారాలు పాటించాలి. ఆవుకు ఆహారం పెట్టి ప్రదక్షిణలు చేయాలి. ఈ ఉప్పు దీపాన్ని ఇంటికి ఈశాన్య దిశలో పెట్టాలి. ఇలా 11, 21 వారాలు చేస్తే శుభం కలుగుతుంది. దాచిపెట్టుకున్న వత్తులను ధూపంలో వాడుకోవచ్చు.
News December 5, 2025
124 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SAIL)లో 124 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఇంజినీరింగ్ డిగ్రీ 65% మార్కులతో ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1050, SC,ST,PwBDలకు రూ.300 వెబ్సైట్: www.sail.co.in


