News April 27, 2024

పెన్షన్ రూ.3,500కు పెంచుతాం: జగన్

image

AP: వైఎస్సార్ పెన్షన్ కానుకను రెండు విడతల్లో రూ.3,500కు పెంచుతామని జగన్ ప్రకటించారు. జనవరి 1, 2028న రూ.250, జనవరి 1, 2029న మరో రూ.250 పెంచుతామని చెప్పారు. ప్రస్తుతం పెన్షన్ నెలకు రూ.3,000 వస్తోందని, 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని జగన్ తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా తామే ఎక్కువ మందికి, ఎక్కువ మొత్తం ఇస్తున్నామని పేర్కొన్నారు.

Similar News

News March 16, 2026

ఆగిన ఎగుమతులు.. కుప్పకూలిన అరటి ధరలు

image

AP: పశ్చిమాసియాలో యుద్ధంతో అరటి రైతులు కుదేలవుతున్నారు. గల్ఫ్ దేశాలకు ఎగుమతులు ఆగిపోవడంతో 2 వారాల్లోనే వారి జీవితాలు తలకిందులయ్యాయి. ఈ నెల ఆరంభంలో టన్ను ధర రూ.20-23వేలు ఉండగా ప్రస్తుతం రూ.6-8వేలకు పడిపోయింది. స్థానికంగానూ కొనడానికి వ్యాపారులు ముందుకు రావట్లేదని అన్నదాతలు వాపోతున్నారు. వార్ ఇలాగే కొనసాగితే రేట్లు మరింత పతనమవుతాయని అంచనా. రాయలసీమలో దాదాపు లక్ష ఎకరాల్లో అరటి సాగవుతుంది.

News March 16, 2026

ఆస్కార్-2026 విజేతలు..

image

*ఉత్తమ సహాయ నటి – ఎమీ మ్యాడిగన్(వెపన్స్)
*బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ – కెపాప్ డిమోన్ హంటర్స్ (మ్యాగీ కాంగ్, క్రిస్ అపెల్హాన్స్, మిషెల్లీ వాంగ్)
*బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ – ది గర్ల్ హూ క్రైడ్ పర్ల్స్(క్రిస్ లావిస్, మసీక్ జెజెర్బోవ్‌స్కీ)
*బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ – కేట్ హాలే(ఫ్రాంకెన్‌స్టైన్)
*మేకప్ & హెయిర్ స్టైల్ – మైక్ హిల్, జోర్డాన్ శామ్యూల్, క్లియోనా ఫ్యురే (ఫ్రాంకెన్‌స్టైన్)

News March 16, 2026

నేటి నుంచి ఏపీలో పది పరీక్షలు.. ఇవి చూసుకోండి

image

APలో టెన్త్ పరీక్షలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఉ.9.30-మ.12.45 వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఈ ఏడాది 6,40,916 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో 10AM వరకు అనుమతిస్తారు. OMR షీట్‌పై ఫొటో, పేరు, నంబరును తప్పకుండా సరిచూసుకోవాలి. 24 పేజీల బుక్‌లెట్‌లో జవాబులు రాశాక అవసరమైతే మరో 12 పేజీల బుక్‌లెట్ ఇస్తారు. బ్లూ, బ్లాక్ పాయింట్ పెన్నులకు మాత్రమే అనుమతి ఉంటుంది.#ALL THE BEST