News April 27, 2024

పెన్షన్ రూ.3,500కు పెంచుతాం: జగన్

image

AP: వైఎస్సార్ పెన్షన్ కానుకను రెండు విడతల్లో రూ.3,500కు పెంచుతామని జగన్ ప్రకటించారు. జనవరి 1, 2028న రూ.250, జనవరి 1, 2029న మరో రూ.250 పెంచుతామని చెప్పారు. ప్రస్తుతం పెన్షన్ నెలకు రూ.3,000 వస్తోందని, 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని జగన్ తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా తామే ఎక్కువ మందికి, ఎక్కువ మొత్తం ఇస్తున్నామని పేర్కొన్నారు.

Similar News

News November 21, 2025

గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 33 మంది మృతి

image

గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. ఖాన్ యూనిస్ సిటీలో గురువారం జరిగిన దాడుల్లో 33 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. OCT 11న సీజ్‌ఫైర్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి Israel దాడుల్లో కనీసం 211 మంది చనిపోయారని, 597 మంది గాయపడ్డారని పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందం వల్ల ఎలాంటి మార్పూ రాలేదని, దాడులు కొనసాగుతూనే ఉన్నాయని పాలస్తీనియన్లు ఆవేదన చెందుతున్నారు.

News November 21, 2025

APPLY NOW: CLRIలో ఉద్యోగాలు

image

CSIR-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CLRI)14 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు DEC 22లోపు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MSc, BE, B.Tech, M.Tech, ఎంఫార్మసీ, MVSc, MCA, MBA ఉత్తీర్ణతతో పాటు NET/GATE అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. DEC 22న రాత పరీక్ష, 23న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://www.clri.org/

News November 21, 2025

Rh నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే ఏం చేయాలంటే?

image

తల్లి బ్లడ్ గ్రూప్ నెగటివ్ అయితే ప్రెగ్నెన్సీలో కచ్చితంగా ఇండైరెక్ట్‌ కూంబ్‌ టెస్ట్‌ (ICT) 3,7 నెలల్లో చేయించుకోవాలి. ఐసీటీ నెగెటివ్‌ వస్తే ఏడో నెలలో, డెలివరీ అయిన 72 గంటల్లో తల్లికి ‘యాంటీ డీ’ ఇంజెక్షన్‌ డోసులు ఇస్తారు. రెండోసారి గర్భం దాల్చిన వారిలోనే దీని సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఎప్పటికప్పుడు రక్తపరీక్షలు, డాప్లర్‌ స్కానింగ్‌ పరీక్షలు చేయించాలి. సమస్య తీవ్రతను బట్టి బిడ్డకు చికిత్స చేస్తారు.