News March 9, 2025
న్యాయం కోసం ప్రధానిని కలుస్తాం: హత్యాచార బాధితురాలి తల్లి

కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార దోషి సంజయ్ రాయ్కి జనవరి 20న సెషన్ కోర్టు జీవితఖైదు విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు వెనుక ఇంకా చాలామంది ఉన్నారంటూ మొదటి నుంచీ ఆరోపిస్తూ వస్తున్న బాధితురాలి తల్లి నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో మహిళలకు భద్రతే లేకుండా పోయిందన్నారు. తమ కూతురికి న్యాయం కోసం PM మోదీని కలుస్తామని చెప్పారు. ఈ విషయంలో ఆయన జోక్యం చేసుకోవాలని కోరారు.
Similar News
News March 9, 2025
ఏప్రిల్ 5 నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

AP: ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట రామాలయం బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 5 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు CM చంద్రబాబు సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఏప్రిల్ 11న స్వామి వారి కళ్యాణం సందర్భంగా సీఎం ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని చెప్పారు. భోజన వసతి, ప్రసాద వితరణ ప్రతి భక్తునికి అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
News March 9, 2025
రేపు అమలక ఏకాదశి.. ఏం చేయాలంటే?

ఫాల్గుణ మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశి ‘అమలక ఏకాదశి’. అమలక అంటే ఉసిరికాయ అని అర్థం. ఈరోజున విష్ణుమూర్తి ఉసిరి చెట్టులో నివాసం ఉంటారని నమ్మకం. అందుకే ఉపవాసం ఉండి ఉసిరి చెట్టును పూజిస్తే పుణ్య ఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అన్నదానం, గోదానం, వస్త్రదానం, ఉసిరి, నల్ల నువ్వులు వంటివి దానం చేస్తే మంచిదని పేర్కొన్నారు. సాయంత్రం చంద్ర దర్శనం తర్వాత ఉపవాసాన్ని విరమించవచ్చు.
News March 9, 2025
4 క్యాచ్లు మిస్ చేసిన భారత్

CT ఫైనల్లో భారత ఫీల్డింగ్ పేలవంగా ఉంది. కివీస్ బ్యాటర్లు ఇచ్చిన 4 క్యాచ్లను వదిలేశారు. షమీ, అయ్యర్, రోహిత్, గిల్ క్యాచ్లను వదిలేయడంతో కివీస్ నెమ్మదిగా స్కోర్ పెంచుకుంటూ వెళ్తోంది. జట్టులో అద్భుతమైన క్యాచ్లు అందుకొనే ఫీల్డర్లు కూడా పేలవ ప్రదర్శన చేయడంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. NZ స్కోర్ 37.5 ఓవర్లకు 165/5గా ఉంది.