News March 26, 2025
మా జోలికి వస్తే ఎవరినైనా వదలబోం: నాటో

పోలాండ్ సహా అన్ని సభ్యదేశాల భద్రతకు నాటో కట్టుబడి ఉందని సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే చెప్పారు. తమ జోలికి వస్తే ఎవరినైనా వదిలిపెట్టబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ను హెచ్చరించారు. తమపై దాడి చేసి తప్పించుకోగలమని అనుకుంటే పెద్ద తప్పిదమే అవుతుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో రష్యా-అమెరికా మధ్య సానుకూల చర్చలు జరుగుతున్న వేళ రుట్టే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Similar News
News November 24, 2025
శరణు ఘోషతోనే కొండ ఎక్కుతారు

శబరి యాత్రలో ఎత్తైన, నిట్టనిలువు కొండ ‘కరిమల’. సుమారు 10KM ఎత్తుకు వెళ్లిన తర్వాత భక్తులు దీని శిఖరాన్ని చేరుకుంటారు. ఇక్కడ అతి ప్రాచీనమైన బావి, జలపాతం ఉన్నాయి. భక్తులు ఇక్కడ దాహార్తిని తీర్చుకుంటారు. ఇంత ఎత్తులో జలపాతం ఉండటం దీని ప్రత్యేకత. ఈ కొండ ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం. ‘స్వామియే శరణమయ్యప్ప’ అనే శరణు ఘోష ముందు ఈ కష్టం దూది పింజెలా తేలిపోతుంది. <<-se>>#AyyappaMala<<>>
News November 24, 2025
IIT ధన్బాద్ 105 పోస్టులకు నోటిఫికేషన్

<
News November 24, 2025
జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. జీవో నం.46 ప్రకారం 50% క్యాప్తో రిజర్వు స్థానాలు ఖరారు చేస్తూ కాసేపటి క్రితం ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇందులో SC, STల పంచాయతీలు యథాతథంగా ఉండగా 22% రిజర్వేషన్ మాత్రమే అమలు చేస్తుండటంతో పలుచోట్ల BCల రిజర్వు స్థానాలు మారాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సైతం ఈ వివరాలు పంపింది.


