News September 4, 2025
అవినీతిపరులను మా పార్టీలో చేర్చుకోం: రామ్చందర్

TG: అవినీతిపరులను బీజేపీలో చేర్చుకోబోమని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ రామ్చందర్ రావు స్పష్టం చేశారు. కవితను బీజేపీలో చేర్చుకుంటారా అని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. కవిత వ్యాఖ్యలపై తాను స్పందించనని, మీడియా వాళ్లు కూడా ఆమె చేసిన ఆరోపణలను సీరియస్గా తీసుకోవద్దని సూచించారు. ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. స్టాలిన్ మీటింగ్కు, గవర్నర్ వద్దకు రెండు పార్టీలు కలిసే వెళ్లాయి కదా’ అని ఉదహరించారు.
Similar News
News September 7, 2025
జస్టిస్ సుదర్శన్ రెడ్డికి MIM మద్దతు

వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఇండీ కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వనున్నట్లు ఎంఐఎం ప్రెసిడెంట్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ ఇవ్వాలని సీఎం రేవంత్ తనను కోరినట్లు అసద్ Xలో పోస్ట్ చేశారు. ‘హైదరాబాదీ, న్యాయనిపుణుడైన సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేస్తాం. ఆయనతో మాట్లాడి బెస్ట్ విషెస్ చెప్పాను’ అని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఈనెల 9న జరగనుంది.
News September 7, 2025
RRBలో 434 పోస్టులు.. గడువు పెంపు

RRBలో 434 పారామెడికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించారు. ఈ నెల 18 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని RRB తెలిపింది. నర్సింగ్ సూపరింటెండెంట్లు, ఫార్మాసిస్ట్, టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 వంటి పోస్టులు ఉన్నాయి. పోస్టులను బట్టి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం పోస్టులను బట్టి రూ.21,700 నుంచి రూ.1,12,400 వరకు ఉంటుంది. <
News September 7, 2025
35 ఏళ్లుగా చాయ్ మాత్రమే తాగుతోంది!

ఛత్తీస్గఢ్లోని కొరియా జిల్లాకు చెందిన పల్లి దేవి గత 35 ఏళ్లుగా ఎలాంటి ఆహారం తీసుకోకుండా కేవలం టీ తాగుతూ జీవిస్తున్నారు. ఆమె తన 11 ఏళ్ల వయసు నుంచే ఆహారం, నీటికి బదులుగా టీ తాగుతూ శివుడి పూజలో నిమగ్నమైపోయారు. రోజుకు ఒకసారి బ్లాక్ టీ తాగుతున్నట్లు ఆమె కుటుంబీకులు చెబుతున్నారు. ఇన్నేళ్లుగా టీ మాత్రమే తాగి జీవించడం అసాధ్యమని, ఇప్పటికీ ఆమె ఆరోగ్యంగా ఉండటంపై వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.