News February 9, 2025
క్రమశిక్షణ తప్పినవారిని ఉపేక్షించం: తుమ్మల

TG: కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ తప్పినవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కష్టపడే కార్యకర్తలకే పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ఖమ్మంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికల్లో ప్రజామోదం ఉన్న నేతలకే అవకాశం ఇవ్వాలి. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 9, 2025
టీ20ల్లో మనదే డామినేషన్.. కానీ!

టీ20ల్లో ఓవరాల్గా దక్షిణాఫ్రికాపై టీమ్ ఇండియా డామినేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 31 T20 మ్యాచులు జరగగా భారత్ 18, SA 12 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచులో ఫలితం రాలేదు. అయితే సొంతగడ్డపై ఆడిన 12 మ్యాచుల్లో ఇండియా ఐదింట్లో నెగ్గగా దక్షిణాఫ్రికా ఆరు మ్యాచుల్లో గెలిచింది. మరో మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. కాగా కటక్లో ఆడిన రెండు టీ20ల్లో దక్షిణాఫ్రికానే విజయం సాధించడం గమనార్హం.
News December 9, 2025
ఎర్లీ ప్యూబర్టీ ఎందుకొస్తుందంటే?

పిల్లలు త్వరగా యవ్వన దశకు చేరుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. కుటుంబ చరిత్ర, ఆహారపు అలవాట్లు, అధికబరువు, కొన్ని రకాల కాస్మెటిక్స్, సబ్బులు, డిటర్జెంట్లలో ఉండే పారాబెన్స్, ట్రైక్లోసాన్, ఫ్తాలేట్స్ వంటి రసాయనాలు హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే ఇంట్లో వండిన ఆహారాన్నే తినడం, రసాయనాల వాడకాన్ని తగ్గించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం మంచిదని సూచిస్తున్నారు.
News December 9, 2025
శ్రీశైల క్షేత్రానికి వెళ్తున్నారా?

శ్రీశైలం సముద్ర మట్టానికి 1,500Ft ఎత్తులో, 2,830Ft శిఖరం కలిగిన పవిత్ర క్షేత్రం. కృతయుగంలో హిరణ్యకశ్యపునికి పూజామందిరంగా, రాముడు, పాండవులు దర్శించిన స్థలంగా ప్రసిద్ధి చెందింది. క్రీ.శ.1,326-35లో దీనికి మెట్లు నిర్మించారు. ఎంతో కష్టపడొచ్చి దూళి దర్శనం చేసుకున్న భక్తులు పాతాళ గంగలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. ఈ క్షేత్రాన్ని తప్పక దర్శించి దైవానుగ్రహం పొందాలని పండితులు సూచిస్తున్నారు.


