News September 2, 2025
ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం: రాహుల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిహార్లో చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర ముగిసింది. ఈ సందర్భంగా వచ్చే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వమని ప్రతిజ్ఞ చేశారు. తమ శక్తి మేరకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని రక్షిస్తామన్నారు. ‘యాత్రను చరిత్రాత్మకంగా మార్చిన ఇండీ కూటమి నేతలు లాలూ ప్రసాద్, తేజస్వీ, దీపాంకర్, ముకేశ్ సాహ్ని, కాంగ్రెస్ శ్రేణులు, రాష్ట్ర యువతకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News September 22, 2025
KBCలో రూ.50లక్షలు గెలుచుకున్న కార్పెంటర్

అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్పతి’తో ఓ సామాన్యుడు కోటీశ్వరుడు కాకపోయినా లక్షాధికారి అయ్యాడు. పంజాబ్లోని హుస్సేన్పూర్కు చెందిన చందర్పాల్ కార్పెంటర్ వర్కర్. పెద్దగా చదువుకోకపోయినా వివిధ అంశాలపై జ్ఞానం పొంది, కేబీసీలో పాల్గొన్నాడు. అమితాబ్ అడిగిన రూ.50 లక్షల ప్రశ్నకు ఆడియన్స్ పోల్, 50-50 ఆప్షన్లు వాడుకొని సరైన సమాధానం చెప్పాడు. పిల్లల చదువుకు, వ్యాపార విస్తరణకు డబ్బును ఉపయోగిస్తానన్నాడు.
News September 22, 2025
‘SIR’ అమలుకు ఈసీ ఆదేశాలు

దేశవ్యాప్తంగా ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ను అమలు చేసేందుకు ఈసీ సిద్ధమవుతోంది. ఈనెల 30లోపు గతంలో ప్రచురించిన ఓటరు జాబితాలతో సిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు సీఈవోలకు సమాచారం ఇచ్చింది. ఈ ప్రక్రియను అక్టోబర్-నవంబర్లో ప్రారంభించే అవకాశం ఉందని సూత్రప్రాయంగా తెలిపింది. ఇప్పటికే బిహార్లో SIR అమలు చేయగా, అర్హుల ఓట్లు తొలగిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే.
News September 22, 2025
అక్టోబర్ తొలివారంలో బిహార్ ఎన్నికల షెడ్యూల్?

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ తొలి వారంలో షెడ్యూల్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. 2 దశల్లో పోలింగ్ నిర్వహించేందుకు EC సిద్ధమవుతోంది. ఈ ఎన్నికను BJP, కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. NDAలో కీలకంగా ఉన్న అధికార జేడీయూకు BJP మద్దతు ఇస్తోంది. ఇప్పటికే నిధుల కేటాయింపులోనూ కేంద్రం బిహార్కు పెద్దపీట వేస్తోంది. అటు INC నేత రాహుల్ గాంధీ SIRకు వ్యతిరేకంగా యాత్ర చేసి ఓటర్లను ఆకర్షిస్తున్నారు.