News January 1, 2025

అలసత్వం వహిస్తే సహించం: మంత్రి పొన్నం

image

TG: గురుకుల స్కూళ్లలో విద్యార్థులకు మౌలిక వసతులు, భోజనం విషయంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. గురుకుల సొసైటీ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించిన ఆయన, తరచుగా హాస్టళ్లలో తనిఖీలు చేయాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అడ్మిషన్‌తో పాటే యూనిఫామ్, మెటీరియల్ పంపిణీ చేయాలన్నారు. కొత్త మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు.

Similar News

News November 3, 2025

RTC బస్సులకు కెపాసిటీ లిమిట్ రూల్ ఉండదా?

image

ప్రైవేట్ బస్సుల్లో సీటింగ్ కెపాసిటీకి మించి ఒక్కరు ఎక్కువున్నా RTA ఫైన్లు విధిస్తుంది. మీర్జాగూడ ప్రమాదంతో ఇదే రూల్ RTC బస్సులకు వర్తించదా? అనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. RTC సర్వీసుల్లో చాలా రూట్లలో, చాలా సమయాల్లో సీట్లు నిండి లోపల కాలు పెట్టలేనంతగా ప్రయాణికులతో నిండి ఉంటాయి. దీనికి తక్కువ బస్సులు, ప్రజల అవసరాలు లాంటివి కారణం కావచ్చు. కానీ RTCకి ఓవర్ లోడ్ పరిమితి ఉందా? అనేదే అందరి ప్రశ్న.

News November 3, 2025

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం.. 48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు

image

AP: ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ రాష్ట్రంలో ప్రారంభమైంది. దీని కోసం 3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రైతులు 7337359375 వాట్సాప్ నంబర్‌కు HI అని మెసేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కొనుగోలు చేసిన 24-48 గంటల్లోనే అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

News November 3, 2025

బస్సు ప్రమాదంలో చనిపోయింది వీరే

image

TG: <<18184333>>బస్సు ప్రమాదంలో<<>> 19 మంది మరణించగా 15 మందిని అధికారులు గుర్తించారు.
మృతులు: దస్తగిరి బాబా- డ్రైవర్, గుర్రాల అభిత (21)- యాలాల్, మల్లగండ్ల హనుమంతు- దౌల్తాబాద్, షేక్ ఖలీల్ హుస్సేన్, తబస్సుమ్ జహాన్, తాలియా బేగం, ముస్కాన్, సాయిప్రియ, నందిని, తనూష- తాండూరు, తారిబాయ్ (45)- దన్నారం తండా, గోగుల గుణమ్మ, కల్పన (45)- బోరబండ, హైదరాబాద్, బచ్చన్ నాగమణి (55)- భానూరు, ఏమావత్ తాలీబామ్- ధన్నారం తండా