News February 17, 2025
గాజాలో నరకానికి తలుపులు తెరుస్తాం: నెతన్యాహు అల్టిమేటం

హమాస్కు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అల్టిమేటం జారీ చేశారు. వారి వద్ద బందీలుగా ఉన్న తమ దేశ పౌరుల్ని వెంటనే విడుదల చేయకపోతే గాజాలో నరకానికి తలుపులు తెరుస్తామని హెచ్చరించారు. ‘అమెరికాతో కలిసి మేం ఓ వ్యూహం రూపొందించాం. అది బయటికి చెప్పలేను కానీ మా పౌరుల్ని హమాస్ వదలకపోతే వారికి నరకద్వారాల్ని తెరవడం ఖాయం. ఆ సంస్థ సైనిక సామర్థ్యాన్ని, రాజకీయ పాలనను గాజా నుంచి తుడిచిపెట్టేస్తాం’ అని తేల్చిచెప్పారు.
Similar News
News October 19, 2025
తొలి వన్డే.. వర్షంతో మ్యాచ్కు అంతరాయం

పెర్త్లో జరుగుతున్న ఆస్ట్రేలియా, భారత్ తొలి వన్డేకు వరుణుడు ఆటంకం కలిగించాడు. 9వ ఓవర్ నడుస్తుండగా వర్షం పడటంతో మ్యాచ్ ఆపేశారు. ప్రస్తుతం క్రీజులో అయ్యర్(2), అక్షర్ పటేల్(0) ఉన్నారు. రోహిత్, కోహ్లీల తర్వాత గిల్(10) కూడా ఔటయ్యారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 25/3గా ఉంది.
News October 19, 2025
ఒకే అభ్యర్థి రెండు పార్టీల తరఫున నామినేషన్.. ఎందుకంటే?

ఒకే అభ్యర్థి 2, 3 స్థానాల్లో పోటీ చేయడం కామన్. కానీ ఒకే చోట 2 పార్టీల తరఫున పోటీ చేయడం చూశారా? బిహార్లోని ఆలమనగర్లో నబిన్ కుమార్ అనే అభ్యర్థి ముందుగా RJD తరఫున నామినేషన్ దాఖలు చేశారు. సీట్ల సర్దుబాటులో మహా కూటమి స్థానిక పార్టీ VIPకి కేటాయించింది. విషయం తెలిసి వీఐపీ నుంచి నామినేషన్ చేశారు. 2 పార్టీల తరఫున పోటీలో ఉన్నారనే ఫొటోలు వైరలవ్వడంతో RJD నుంచి నామినేషన్ వెనక్కి తీసుకున్నారు.
News October 19, 2025
గృహిణి ఎన్ని వత్తుల దీపం పెట్టాలంటే?

దీపారాధనలో వత్తుల సంఖ్యకు కూడా ప్రాధాన్యం ఉంది. గృహిణి స్వయంగా దీపం వెలిగించేటప్పుడు కుందిలో 5 వత్తులు ఉంచాలని పండితులు చెబుతున్నారు. ఇవి కుటుంబంలోని 5 ముఖ్య అంశాలకు ప్రతీకలుగా నిలుస్తాయని అంటున్నారు. మొదటి వత్తి భర్త, సంతానం క్షేమానికి, రెండోది అత్తమామల శ్రేయస్సుకు, మూడోది తోబుట్టువుల క్షేమానికి ఉద్దేశించినవి. నాల్గోది గౌరవం, ధర్మ వృద్ధిని, ఐదోది వంశాభివృద్ధిని సూచిస్తుంది’ అని చెబుతున్నారు.