News August 19, 2024

బీజేపీలో వైసీపీ విలీనాన్ని వ్యతిరేకిస్తాం: విష్ణుకుమార్

image

AP: వచ్చే ఎన్నికల్లో YCPకి ఐదు సీట్లు కూడా రావని MLA విష్ణుకుమార్ రాజు జోస్యం చెప్పారు. ఆ పార్టీని BJPలో విలీనం చేస్తామంటే ఒప్పుకోబోమని, తీవ్రంగా వ్యతిరేకిస్తామని తెలిపారు. దోచుకున్న రూ.లక్షల కోట్ల డబ్బును జగన్ బెంగళూరు ప్యాలెస్‌లో దాచుకున్నారని ఆరోపించారు. ఆ ప్యాలెస్‌పై రైడ్ చేయకుండా CBI, CID, ACB ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. జగన్ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు కూడా చెక్ చేయాలని డిమాండ్ చేశారు.

Similar News

News October 16, 2025

అఫ్గాన్‌కు భారత్ సపోర్ట్.. పాక్‌కు చావుదెబ్బ!

image

‘శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు’ అని చాణక్యుడు చెప్పారు. TTP అధినేతను హతమార్చేందుకు పాక్ అటాక్ చేయడంతో అఫ్గాన్ యుద్ధానికి దిగింది. దీంతో ఆ రెండు దేశాలు బద్ధ శత్రువులుగా మారాయి. భారత్ రెచ్చగొట్టడం వల్లే అఫ్గాన్ తమపై దాడులు చేస్తోందని పాక్ పసలేని వాదనలు చేస్తోంది. తమ దేశాన్ని చక్కబెట్టుకోలేక మనపై ఏడుస్తోంది. ఈ క్రమంలో భారత్.. అఫ్గాన్‌కు <<18023858>>సపోర్ట్<<>> చేస్తున్నట్లు ప్రకటించి పాక్‌ను చావుదెబ్బ తీసింది.

News October 16, 2025

మహిళలకు చోటిస్తేనే..

image

ఆహార భద్రతను బలోపేతం చేయాలంటే మహిళలకు నిర్ణయ శక్తి ఇవ్వాలని ప్రపంచ ఆహార సంస్థ చెబుతోంది. వారికి భూమి హక్కులు, రుణ సౌకర్యాలు, శిక్షణ, అవగాహన కార్యక్రమాలు అందించడం ద్వారా ఆహార ఉత్పత్తి, నిల్వ, పంపిణీ వ్యవస్థలు బలోపేతం అవుతాయి. ఆకలి, పేదరికం, పోషకాహార లోపం తగ్గుతాయి. ఆహార భద్రతను సాధించడానికి ప్రభుత్వాలూ, NGOలతో కలిసి అందులో మహిళలకుచోటు కల్పించాలంటోంది ప్రపంచ ఆహార సంస్థ.

News October 16, 2025

బీసీ రిజర్వేషన్లు.. 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

image

TG: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై రెండు రోజుల్లో న్యాయ నిపుణుల అభిప్రాయాలతో నివేదిక ఇవ్వాలని మంత్రివర్గం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఇవాళ డిస్మిస్ కావడంతో తదుపరి కార్యాచరణపై క్యాబినెట్‌లో చర్చించారు. ఈ కేసును వాదించిన సీనియర్ న్యాయవాదులు, న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుని తదుపరి కార్యాచరణ చేపట్టాలని ఆదేశించింది.