News November 20, 2024
ఒక్కో బందీకి రూ.42కోట్లిస్తాం: గాజా ప్రజలకు నెతన్యాహు బంపర్ ఆఫర్

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గాజా ప్రజలకు టెంప్టింగ్ ఆఫర్ ఇచ్చారు. హమాస్ చేతిలో బందీలైన తమ పౌరులను తీసుకొస్తే ఒక్కొక్కరికి రూ.42కోట్ల ($5M) చొప్పున ఇస్తామని ప్రకటించారు. ‘ఘర్షణ వద్దనుకుంటున్న వారికి నేను చెప్పేదొకటే. బందీలను తీసుకురండి. డబ్బులిచ్చి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని క్షేమంగా పంపించేస్తాం. ఏ దారి ఎంచుకుంటారో మీ ఇష్టం. మేమైతే బందీలను కచ్చితంగా విడిపిస్తాం’ అని గాజా తీరంలో తెలిపారు.
Similar News
News November 1, 2025
నేడు శ్రీసత్యసాయి జిల్లాలో CM CBN పర్యటన

AP: సీఎం చంద్రబాబు ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. కదిరి నియోజకవర్గంలోని పెద్దన్నవారిపల్లిలో మ.12.45 గంటలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదు స్వీకరించనున్నారు. పెన్షన్ లబ్ధిదారులతో ముచ్చటించిన అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత టీడీపీ శ్రేణులతో సమావేశమవుతారు.
News November 1, 2025
పుష్ప, KGF కూడా అలా రిలీజ్ చేస్తారా?

‘బాహుబలి’ యూనివర్స్లో వచ్చిన 2 భాగాలను కలిపి ‘బాహుబలి-ది ఎపిక్’గా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇలా 2 పార్టులుగా వచ్చి హిట్ అయిన సినిమాలపై చర్చ జరుగుతోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప, పుష్ప-2, ప్రశాంత్ నీల్-యశ్ కాంబోలో వచ్చిన KGF, KGF-2ను కూడా ట్రిమ్ చేసి ఇలా ఒకే సినిమాగా రిలీజ్ చేస్తే బాగుంటుందని పలువురు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త ట్రెండ్పై మీరేమంటారు?
News November 1, 2025
JEE మెయిన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్-2026 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. <


