News April 3, 2025
ఆ ఫొటోగ్రాఫర్ను పట్టిస్తే రూ.10 లక్షలిస్తాం: కాంగ్రెస్ నేత

HCU భూములను జేసీబీలు చదును చేస్తుంటే అక్కడే ఉన్న జింకలు, నెమళ్లు పరుగులు తీసిన ఫొటోను సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు, నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. అయితే, ఇది ఏఐ ఎడిటెడ్ ఫొటో అని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి ఇంత గొప్ప ఫొటోను తీసిన వ్యక్తిని గుర్తించి తమకు పట్టిస్తే రూ.10 లక్షలు రివార్డ్ ఇస్తామని సెటైరికల్ ట్వీట్ చేశారు.
Similar News
News September 11, 2025
అమరావతిలో బ్యాంకర్ల బృందం పర్యటన

AP: అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల బృందం పర్యటించింది. నగర అభివృద్ధి, మౌలిక వసతుల ప్రాజెక్టు కింద అమలవుతున్న పర్యావరణ, సామాజిక రక్షణ కార్యకలాపాలను పరిశీలించింది. CRDA అధికారులు, ఆయా సంస్థల ప్రతినిధులకు సూచనలు చేసింది. ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ నర్సరీ, CRDA స్కిల్ హబ్ ప్రాంగణం, N9 ట్రంక్ రోడ్ పనులు, శాఖమూరు, నీరుకొండ రిజర్వాయర్ల వద్ద రక్షణ చర్యలను చెక్ చేసింది.
News September 11, 2025
గొర్రెల స్కాం.. బాధితులను విచారణకు పిలిచిన ఈడీ

TG: గొర్రెల స్కాం కేసులో ఈడీ దూకుడు పెంచింది. గొర్రెలు కొనకుండానే రూ.కోట్లు కొట్టేశారనే ఆరోపణలపై విచారణ జరుపుతోంది. ఈ నెల 15న విచారణకు రావాలని బాధితులకు నోటీసులు జారీ చేసింది. ఏపీకి చెందిన గొర్రెల కాపరులకు రూ.2 కోట్లు ఎగవేసి అధికారులు, బ్రోకర్లు కుమ్మక్కై నిధులు స్వాహా చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురు అధికారులు అరెస్టవ్వగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ OSDపైనా కేసు నమోదైంది.
News September 11, 2025
‘మిరాయ్’లో ప్రభాస్?

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజా సజ్జ హీరోగా తెరకెక్కిన ‘మిరాయ్’లో రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నట్లు తెలుస్తోంది. రేపు రిలీజ్ నేపథ్యంలో.. హింట్ ఇస్తూ హీరో తేజ ట్వీట్ చేశారు. ‘ప్రభాస్ తన సహృదయంతో ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా మార్చారు. మూవీ ప్రారంభంలో రెబల్ సర్ప్రైజ్ మిస్ అవకండి’ అంటూ పేర్కొన్నారు. దీంతో ఆయన వాయిస్ ఓవర్ ఉంటుందా లేదా క్యామియో ఉంటుందా అనేది మరి కొన్ని గంటల్లో క్లారిటీ కానుంది.