News April 3, 2025
ఆ ఫొటోగ్రాఫర్ను పట్టిస్తే రూ.10 లక్షలిస్తాం: కాంగ్రెస్ నేత

HCU భూములను జేసీబీలు చదును చేస్తుంటే అక్కడే ఉన్న జింకలు, నెమళ్లు పరుగులు తీసిన ఫొటోను సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు, నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. అయితే, ఇది ఏఐ ఎడిటెడ్ ఫొటో అని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి ఇంత గొప్ప ఫొటోను తీసిన వ్యక్తిని గుర్తించి తమకు పట్టిస్తే రూ.10 లక్షలు రివార్డ్ ఇస్తామని సెటైరికల్ ట్వీట్ చేశారు.
Similar News
News November 17, 2025
మూడో భర్తకూ హీరోయిన్ విడాకులు!

మలయాళ హీరోయిన్ మీరా వాసుదేవన్ మూడో భర్తకూ విడాకులు ఇచ్చినట్లు సమాచారం. 2025 AUG నుంచి సింగిల్గా ఉంటున్నానని ఆమె ఇన్స్టాలో పోస్టు చేశారు. మీరా 2005లో విశాల్ అగర్వాల్ను పెళ్లాడి ఐదేళ్లకు డివోర్స్ ఇచ్చారు. 2012లో నటుడు జాన్ కొక్కెన్ను వివాహం చేసుకోగా ఓ బాబు పుట్టాడు. 2016లో ఆయనకు విడాకులిచ్చి 2024లో కెమెరామెన్ విపిన్ను పెళ్లాడారు. కాగా ఈమె తెలుగులో గోల్మాల్, అంజలి ఐ లవ్ యూ చిత్రాల్లో నటించారు.
News November 17, 2025
‘అన్నదాత సుఖీభవ’.. అచ్చెన్న కీలక ఆదేశాలు

AP: ఈ నెల 19న <<18310567>>అన్నదాత సుఖీభవ<<>> పథకం అమలు నేపథ్యంలో అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘అర్హులైన రైతులు చనిపోతే వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలి. NPCIలో ఇన్యాక్టివ్గా ఉన్న అకౌంట్లను యాక్టివేట్ చేయాలి. ఈ దిశగా రైతులకు అవగాహన కల్పించాలి. అలాగే ఈ స్కీమ్కు అర్హత ఉన్న వారు ఆన్లైన్లో నమోదు చేసుకునే విధానాన్ని సులభతరం చేయాలి’ అని సూచించారు.
News November 17, 2025
గర్భంతో ఉన్నప్పుడు ఇద్దరి కోసం తినాలా?

చాలామంది పెద్దవాళ్లు గర్భవతి ఇద్దరి కోసం తినాలంటూ ఒత్తిడి చేస్తుంటారు. కానీ అది సరికాదంటున్నారు నిపుణులు. గర్భవతులు తమ బరువు పెరుగుదలను ఆరోగ్యకరమైన పరిమితిలో ఉంచుకోవడానికి తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం మంచిది. అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవాలి. అలాగే కొందరు ప్రెగ్నెన్సీలో అసలు బరువే పెరగకపోవచ్చు. అది వారి శరీరతత్వంపై ఆధారపడి ఉంటుంది. దీనివల్ల ప్రెగ్నెన్సీకి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.


