News February 1, 2025
తర్వాతి మ్యాచ్లో షమీని ఆడిస్తాం: మోర్కెల్
ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో భాగంగా రేపు జరిగే ఆఖరి మ్యాచ్లో షమీని ఆడించనున్నట్లు భారత బౌలింగ్ కోచ్ మోర్కెల్ తెలిపారు. ‘షమీ చాలా బాగా ఆడుతున్నారు. వార్మప్ గేమ్స్లో శరవేగంగా బౌలింగ్ చేస్తున్నారు. వచ్చే మ్యాచ్కి ఆయన్ను ఆడిస్తాం. ఆ అనుభవం యువ ఆటగాళ్లకు కీలకం’ అని పేర్కొన్నారు. గాయం నుంచి కోలుకున్నప్పటికీ షమీకి భారత జట్టులో వరుస అవకాశాలివ్వకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
Similar News
News February 1, 2025
శ్రీలంకను మట్టికరిపించిన ఆసీస్
తొలి టెస్టులో SLను ఆస్ట్రేలియా మట్టికరిపించింది. గాలే వేదికగా జరిగిన టెస్టులో వార్ వన్ సైడ్ అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 654-6 వద్ద డిక్లేర్ చేసింది. తొలి INGలో 165కే ఆలౌట్ అయిన శ్రీలంక ఫాలో ఆన్ ఆడింది. 4వ రోజు అందులోనూ 247 పరుగులకే ఆలౌట్ కావడంతో ఆసీస్ ఓ ఇన్నింగ్స్ & 242 రన్స్ తేడాతో గెలుపొందింది. టెస్టుల్లో AUSకు ఇది నాలుగో అతిపెద్ద విజయం. డబుల్ సెంచరీ చేసిన ఖవాజాకు POTM అవార్డు దక్కింది.
News February 1, 2025
చంద్రబాబు సిగ్గుపడాలి: అంబటి రాంబాబు
AP: బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీ కంటే బిహార్ ఎక్కువ సాధించిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఇందులో నితీశ్ కుమార్ విజయాన్ని చూసి CM చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. మరోవైపు, తమ నలుగురు కార్పొరేటర్లను టీడీపీలో చేర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెమ్మసాని కార్పొరేటర్ స్థాయికి దిగిపోయారని ఎద్దేవా చేశారు. తిరుపతి Dy. మేయర్గా పోటీ చేయాలనుకుంటే శేఖర్ రెడ్డి ఇంటిని కూల్చేశారని మండిపడ్డారు.
News February 1, 2025
క్రికెట్కు గుడ్బై: సాహా
భారత క్రికెటర్ వృద్ధిమాన్ సాహా అన్ని ఫార్మాట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. 28 ఏళ్ల పాటు స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ, క్లబ్, డిస్ట్రిక్ట్, స్టేట్, అంతర్జాతీయ మ్యాచ్లు ఆడారు. IPLలో KKR, SRH, GT, పంజాబ్కు ఆడారు. కుటుంబంతో సమయం గడిపేందుకు, జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నట్లు Xలో పోస్ట్ పెట్టారు. సాహా 40 టెస్టుల్లో 1,353 పరుగులు, 9 ODIల్లో 41, 122 FC మ్యాచుల్లో 6,423 రన్స్ చేశారు.