News July 29, 2024

ఏపీ పిల్లల్ని ఒలింపిక్స్‌లో పోటీపడేలా సిద్ధం చేస్తాం: లోకేశ్

image

APలోని పిల్లలకు ప్రపంచ స్థాయి క్రీడా సౌకర్యాలు, శిక్షణ అందించి ఒలింపిక్స్‌లో పోటీపడేలా సిద్ధం చేయాలని CM చంద్రబాబు కోరుకుంటున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ఇందుకోసం 2018లోనే ‘ప్రాజెక్టు గాండీవ’ను తీసుకొచ్చి స్టార్ స్ప్రింటర్ జ్యోతి యర్రాజీని గుర్తించామని, ఇప్పుడామె ఒలింపిక్స్‌లో పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని లింక్డిన్‌లో <>పోస్టు<<>> చేసిన మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేకు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News October 24, 2025

నల్గొండ: 154 వైన్ షాపులకు 4,905 దరఖాస్తులు

image

నల్గొండ జిల్లాలో మద్యం టెండర్ల ప్రక్రియ ముగిసింది. జిల్లాలోని 154 వైన్ షాపుల కోసం మొత్తం 4,905 టెండర్లు దాఖలయ్యాయి. ఇందులో నల్గొండ డివిజన్‌లో అత్యధికంగా 1,417, మిర్యాలగూడలో 988, దేవరకొండలో 621, హాలియాలో 509, నకిరేకల్‌లో 512, చండూరులో 398 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

News October 24, 2025

అక్టోబర్ 24: చరిత్రలో ఈరోజు

image

1930: నిర్మాత చవ్వా చంద్రశేఖర్ రెడ్డి జననం
1966: నటి నదియా జననం
1980: నటి లైలా జననం
1985: బాల్ పాయింట్ పెన్ ఆవిష్కర్త లాస్లో బైరో మరణం
2015: హాస్య నటుడు మాడా వెంకటేశ్వరరావు మరణం
2017: దక్షిణ భారత సినిమా దర్శకుడు ఐ.వి.శశి మరణం
✿ఐక్యరాజ్య సమితి దినోత్సవం
✿ప్రపంచ పోలియో దినోత్సవం

News October 24, 2025

WWC 2025: సెమీస్ చేరిన జట్లివే..

image

మహిళల వన్డే వరల్డ్ కప్(WWC) 2025లో సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. NZతో మ్యాచులో విజయంతో టీమ్‌ఇండియా సెమీస్ చేరింది. అంతకుముందు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా సెమీస్ చేరుకున్న సంగతి తెలిసిందే. సెమీఫైనల్‌కు ముందు ఈ జట్లు తలో మ్యాచ్ ఆడనున్నాయి. ఈ నెల 26న బంగ్లాతో మ్యాచులో భారత్ గెలిచినా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలోనే ఉండనుంది. అటు మిగతా 3 జట్ల ప్రదర్శన టాప్-3 స్థానాలను ఖరారు చేయనుంది.