News November 20, 2024
ప్రజలకు సురక్షిత నీరు ఇస్తాం: పవన్ కళ్యాణ్

AP: ప్రజలకు సురక్షిత నీరు అందించేందుకు గట్టి సంకల్పంతో ఉన్నామని డిప్యూటీ CM పవన్ వెల్లడించారు. ఇందుకోసం కేంద్రం ఇచ్చిన జల జీవన్ మిషన్ నిధులను పూర్తిస్థాయిలో వినియోగిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ’75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో ప్రజలకు ఇంకా సురక్షిత నీరు అందకపోవడం చాలా బాధాకరం. తిరువూరు, ఉద్దానం, కనిగిరి, ఉదయగిరి సహా మరిన్ని ప్రాంతాల్లో మంచినీరు ఇచ్చేలా RO ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం’ అని ప్రకటించారు.
Similar News
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


