News June 15, 2024
YCP నేతలు తిన్న సొమ్మంతా కక్కిస్తాం: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

AP: గత ఐదేళ్లలో వైసీపీ నేతలు తిన్న సొమ్మంతా కక్కించే వరకు వదిలిపెట్టమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని ఆ పార్టీ నేతలు దోచుకున్నారని విమర్శించారు. వారు ఎక్కడ దాచినా బయటికి తీసుకొస్తామని పేర్కొన్నారు. కాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
Similar News
News January 5, 2026
ఎవరో ఎందుకు.. సమస్యను మనమే పరిష్కరించుకోలేమా?

AP-TG మధ్య నదీ జలాల వివాదాలు మళ్లీ ముదురుతున్నాయి. వీటి పరిష్కారానికి కేంద్రం ఓ కమిటీని ఏర్పాటుచేయగా, నల్లమల సాగర్పై ప్రభుత్వాలు సుప్రీంకోర్టు మెట్లెక్కాయి. అయితే తెలుగువారి ఆత్మగౌరవమంటూ బీరాలు పలికే నాయకులు, మేధావులు కూర్చుని ఓ పరిష్కారానికి ఎందుకు ప్రయత్నించట్లేదు? ఢిల్లీవాళ్లే వివాదాన్ని తేల్చాలా? కడలిపాలయ్యే నీళ్లను ఉపయోగించుకునే తెలివితేటలు మనకు లేవా? సమాధానం చెప్పేదెవరు?
News January 5, 2026
‘రాయలసీమ ప్రాజెక్ట్’పై అసలేం జరిగిందంటే…

రాయలసీమకు సాగునీటి కోసం YS జగన్ CMగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. అయితే అనుమతులు లేకుండా దీన్ని చేపట్టారని TG SCని ఆశ్రయించింది. ఈ ప్రాజెక్టుపై ముందుకెళ్లొద్దని కేంద్రమూ APని ఆదేశించింది. మరోవైపు జి.శ్రీనివాస్(TG) అనే వ్యక్తి కేసు వేయగా పనులు ఆపేయాలని 2020 OCT 29న NGT తీర్పిచ్చింది. 2024లోనూ పనుల నిలుపుదలకు ఆదేశాలిచ్చింది. దీనిపై 2025 MARలో AP కౌంటర్ దాఖలు చేసింది. ఈనెల 22న NGTలో విచారణ జరగనుంది.
News January 5, 2026
మళ్లీ పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు గంటల వ్యవధిలోనే <<18766451>>మళ్లీ<<>> పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ మొత్తం రూ.2,020 పెరిగి రూ.1,37,840కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,850 ఎగబాకి రూ.1,26,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.8వేలు పెరిగి రూ.2,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


