News March 31, 2024
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గిస్తాం: లోకేశ్

AP: తాము అధికారంలోకి రాగానే ఇంటి పన్ను, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ హామీ ఇచ్చారు. పాత ఇసుక విధానాన్ని తీసుకొస్తామని, మైనింగ్ విభాగంపై విచారణ కమిటీ వేస్తామని చెప్పారు. వ్యవసాయ ఆధారిత ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని ఆరోపించారు.
Similar News
News March 6, 2026
RECORD: దేశంలోనే పిన్నవయసు CA

రాజస్థాన్కు చెందిన రాజ్కుమారి పరేఖ్ చరిత్ర సృష్టించారు. దేశంలోనే అత్యంత పిన్నవయసు ఛార్టెర్డ్ అకౌంటెంట్ (CA)గా నిలిచారు. ఇటీవల సీఏ ఫైనల్ ఫలితాల్లో ఆమె ఉత్తీర్ణత సాధించారు. 19 ఏళ్ల 126 రోజుల్లోనే ఈ ఘనత సాధించారు. అంతకుముందు ఈ రికార్డు మధ్యప్రదేశ్కు చెందిన నందినీ అగర్వాల్ (19 ఏళ్ల 330 రోజులు) పేరిట ఉండేది. కాగా దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో సీఏ ఒకటి.
News March 6, 2026
ఎప్స్టీన్ ఫైల్స్.. ట్రంప్పై షాకింగ్ ఆరోపణలు

ఎప్స్టీన్ కేసులో అదృశ్యమైన 16 పేజీల డాక్యుమెంట్లను US DOJ తాజాగా బయటపెట్టింది. ఇందులో 1983లో ఒక మైనర్ బాలికపై ట్రంప్ లైంగిక దాడికి పాల్పడ్డారన్న తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో తాను అడ్డుచెప్పగా ట్రంప్ తనను కొట్టి అక్కడి నుంచి పంపేశారని ఆ మహిళ FBI విచారణలో పేర్కొంది. ఈ రికార్డులను ఇన్నాళ్లూ ఎందుకు దాచారనే అంశం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. కాగా ట్రంప్ ఈ ఆరోపణలను ఖండించారు.
News March 6, 2026
ముంబై న్యూ జెర్సీలో హిట్మ్యాన్

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ IPL-2026కు ప్రిపేర్ అవుతున్నారు. తాజాగా ముంబై ఇండియన్స్ న్యూ జెర్సీలో ఫొటోలకు పోజులిచ్చారు. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న రోహిత్.. ఐపీఎల్ కోసం ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించారు. గతంతో పోలిస్తే ఫుల్ ఫిట్నెస్ సాధించిన హిట్మ్యాన్.. ప్రత్యర్థులపై ఎలా చెలరేగుతారో చూడాలి. మార్చి 28 నుంచి ఐపీఎల్ ప్రారంభం అవుతుందని క్రీడావర్గాలు వెల్లడించాయి.


