News June 20, 2024

అమరావతిపై వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం: సీఎం

image

AP: అమరావతిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ‘వైసీపీ హయాంలో అమరావతిలో ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉండిపోయింది. 80% పూర్తైన MLA, MLC క్వార్టర్స్ కూడా పూర్తి చేయలేదు. భవనాలు బూజు పట్టిపోయాయి. రైతుల్ని ఎంతో ఇబ్బంది పెట్టి దౌర్జన్యంగా వ్యవహరించారు. అన్ని ప్రాంతాల నుంచి పవిత్ర మట్టి, నీరు తెచ్చి అమరావతి శంకుస్థాపన చేశాం. ఈ స్థల మహత్యమే అమరావతిని కాపాడింది’ అని అన్నారు.

Similar News

News January 20, 2026

72 గంటల్లో లొంగిపోండి.. ఇరాన్ హెచ్చరికలు

image

నిరసనకారులకు ఇరాన్ అల్టిమేటం జారీ చేసింది. 72 గంటల్లోగా లొంగిపోవాలని, లేదంటే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నేషనల్ పోలీస్ చీఫ్ అహ్మద్ రెజా హెచ్చరించారు. అల్లర్లలో పాల్గొన్న యువకులను శత్రు సైనికులుగా కాకుండా మోసపోయిన వారిగా పరిగణిస్తామని చెప్పారు. గడువులోగా సరెండర్ అయితే వారిపై దయతో వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. 2 వారాలుగా ఇరాన్‌లో జరుగుతున్న నిరసనల్లో వేలాది మంది చనిపోయిన విషయం తెలిసిందే.

News January 20, 2026

అడవులు ఖాళీ.. ఇక దోమల టార్గెట్ మనుషులే!

image

అడవులు తగ్గిపోతుండటంతో దోమలు ఇప్పుడు జంతువులకు బదులుగా మనుషుల రక్తం తాగడానికి ఇష్టపడుతున్నాయని బ్రెజిల్‌లో జరిగిన స్టడీలో తేలింది. అడవులు అంతరించిపోవడం వల్ల జంతువులు దూరమై దోమలకు వేరే ఆప్షన్ లేక మనుషులపై పడుతున్నాయట. 1,700 దోమలపై జరిపిన ఈ అధ్యయనంలో అవి మనుషుల రక్తానికే ప్రాధాన్యం ఇస్తున్నాయని తెలిసింది. దీనివల్ల ఫ్యూచర్‌లో కొత్త రకమైన రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

News January 20, 2026

మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

image

TG: మైనార్టీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో ప్రవేశాలకు అప్లై చేసుకోవాలని మంత్రి అజహరుద్దీన్ తెలిపారు. ఐదోతరగతి, ఇంటర్ ఫస్టియర్‌తో పాటు 6,7,8 బ్యాక్‌లాగ్ ఖాళీలకు FEB 28 వరకు <>దరఖాస్తు<<>> చేసుకోవచ్చని, గడువు పెంపు ఉండబోదన్నారు. ఇంటర్‌కు టెన్త్‌లో వచ్చిన మార్కులు, COEల్లో ప్రవేశానికి ఎంట్రన్స్, ఇంటర్వ్యూ ఉంటాయన్నారు. ఐదో తరగతి, బ్యాక్ లాగ్ ఖాళీలకు ఏప్రిల్ 24-30 వరకు విద్యార్థుల ఎంపిక ఉంటుందని చెప్పారు.