News December 18, 2024

ఎక్స్‌లో హ్యాష్‌ ట్యాగ్‌లు తీసేస్తాం: మస్క్

image

ట్విటర్ (X)లో హ్యాష్‌ట్యాగ్‌లు తీసేయాలని భావిస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ తెలిపారు. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ అవసరం లేదని చెప్పారు. నెటిజన్లు కూడా దీనిని ఉపయోగించడం ఆపేయాలని సూచించారు. ఇది చాలా ఎబ్బెట్టుగా కనిపిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా బ్రిటన్‌కు చెందిన ‘రీ ఫామ్’ అనే రాజకీయ పార్టీకి మస్క్ దాదాపు రూ.849 కోట్లు విరాళం ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Similar News

News December 25, 2025

ఫ్రెషర్లకు రూ.21 లక్షల జీతం.. ఇన్ఫోసిస్ డ్రైవ్!

image

దేశంలో మేజర్ ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ ఫ్రెషర్ల కోసం ఆఫ్-క్యాంపస్ నియామక డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఏడాదికి రూ.7-21 లక్షల వరకు ప్యాకేజీ ఉండే అవకాశం ఉందని మనీ కంట్రోల్ తెలిపింది. స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ (లెవెల్ 1-3), డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజినీర్ (ట్రైనీ) పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, ఐటీ, EEEలో BE, BTech, ME, MTech, MCA చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు ఉండనున్నట్లు వివరించింది.

News December 25, 2025

21 లక్షల Sft విస్తీర్ణంలో హైకోర్టు నిర్మాణం

image

AP: అమరావతిలో 7 భవనాలను ఐకానిక్ నిర్మాణాలుగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ‘21 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో హైకోర్టును నిర్మిస్తున్నాం. 8వ అంతస్తులో CJ కోర్టు, 2, 4, 6 అంతస్తుల్లో కోర్టు హాళ్లుంటాయి. 2027 నాటికి పనులు పూర్తవుతాయి’ అని వివరించారు. గత ప్రభుత్వం వల్ల పనులు ఆలస్యమయ్యాయని విమర్శించారు. హైకోర్టు రాఫ్ట్ ఫౌండేషన్ పనులను ఆయన ఇవాళ ప్రారంభించారు.

News December 25, 2025

నిత్య పెళ్లి కూతురు.. 9 మందిని పెళ్లి చేసుకుంది

image

AP: పెళ్లి అంటే కొత్త జీవితానికి నాంది. కానీ ఈ యువతికి మాత్రం సరదా. శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురంలో నిత్య పెళ్లికూతురు వాణి ఉదంతం వెలుగులోకి వచ్చింది. అమాయక యువకులే టార్గెట్‌గా మేనత్త సహాయంతో 8 మందిని పెళ్లాడింది. వివాహం తర్వాత డబ్బులు, బంగారంతో పరారైంది. తాజాగా బరంపురం యువకుడిని మ్యారేజ్ చేసుకొని ఆరోజు రాత్రే పరారవ్వడంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఆమె ఇప్పటికే పలువురిని మోసగించినట్లు బయటపడింది.