News June 28, 2024
లోపాలను సమీక్షించుకుంటాం.. కార్యకర్తలకు అండగా ఉంటాం: కాకాణి

AP: అధికారం ఉన్నప్పుడు ప్రజలకు న్యాయం చేశామని, ఇప్పుడు వారికి అన్యాయం జరగకుండా అడ్డుకుంటామని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. తమ హయాంలో జరిగిన లోపాలను సమీక్షించుకుంటామని, కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు. వైసీపీకి ఆదరణ తగ్గలేదని, ఒంటరిగానే 40% ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చిన చంద్రబాబు ఇప్పుడు పింఛన్ తప్ప మరే పథకం గురించి మాట్లాడట్లేదని విమర్శించారు.
Similar News
News April 7, 2026
పంజాబీ నటితో అర్ష్దీప్ డేటింగ్? ఫొటో వైరల్!

స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ తాజాగా షేర్ చేసిన ఒక స్నాప్చాట్ ఫొటో హాట్ టాపిక్గా మారింది. దాంట్లో అర్ష్దీప్ ఒకమ్మాయి చేయి పట్టుకొని ఉండగా నెటిజన్లు ఆమె పంజాబీ నటి సమ్రీన్ కౌర్ అని అంటున్నారు. ఆమె చేతిపై ఉన్న టాటూ ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చారు. IPL 2026 మ్యాచుల్లో సమ్రీన్ పంజాబ్ జెర్సీలో కనిపించడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. వీరిద్దరూ తమ రిలేషన్పై ఇప్పటివరకు స్పందించలేదు.
News April 7, 2026
అపస్మారక స్థితిలో ఇరాన్ సుప్రీం లీడర్!

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆచూకీపై తొలిసారి కీలక సమాచారం బయటకు వచ్చింది. ఆయన ఇరాన్లోని ఖోమ్ నగరంలో అపస్మారక స్థితిలో చికిత్స తీసుకుంటున్నారని అమెరికా, ఇజ్రాయెల్ గూఢచారులు గల్ఫ్ దేశాలకు చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. తన పనులు తాను చేసుకోలేని స్థితిలో ఉన్నారట. కాగా FEB 28 దాడుల్లో అలీ ఖమేనీ చనిపోగా, మొజ్తబా గాయపడ్డారు. షియా ముస్లింలకు పవిత్రంగా భావించే ఖోమ్లో అలీ అంత్యక్రియలు జరిగాయి.
News April 7, 2026
BREAKING: తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నేడు బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.820 తగ్గి రూ.1,49,840 వద్ద కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.750 క్షీణించి రూ.1,37,350కి చేరింది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.5వేలు తగ్గి రూ.2,55,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో కాస్త తేడాలుండొచ్చు.


