News July 25, 2024
ఇకపై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం: KCR

TG: డిప్యూటీ CM భట్టి చేసిన బడ్జెట్ ప్రసంగం ఓ కథలా, రాజకీయ ప్రసంగంలా ఉందని BRS అధినేత కేసీఆర్ అన్నారు. ఈ ప్రభుత్వం రైతులను వంచించిందని, బడ్జెట్లో ఒక్క పాలసీ ప్రకటించలేదని, ఒక్క ఇండస్ట్రీ పేరు చెప్పలేదని విమర్శించారు. ఏ ఒక్క దానిపైనా క్లారిటీ లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలకూ ఇచ్చిందేమి లేదని, రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సరిగ్గా లేదన్నారు. ఇక ప్రభుత్వాన్ని చీల్చిచెండాడుతామని హెచ్చరించారు.
Similar News
News November 14, 2025
బిహార్ కౌంటింగ్.. వీడనున్న సస్పెన్స్!

బిహార్లో 243 అసెంబ్లీ స్థానాలతో పలు రాష్ట్రాల్లోని ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. బిహార్లో మొత్తం 2,616 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 38 జిల్లాల్లోని 46 సెంటర్లలో కౌంటింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపునకు ఈసీ 4,372 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేసింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కించనున్నారు.
News November 14, 2025
నవంబర్ 14: చరిత్రలో ఈ రోజు

⋆ 1889: భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జననం (ఫొటోలో)
⋆ 1948: రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ జననం
⋆ 1967: భారత మాజీ క్రికెటర్ సి.కె.నాయుడు మరణం
⋆ జాతీయ బాలల దినోత్సవం
⋆ తెలంగాణ నీటిపారుదల దినోత్సవం
⋆ ప్రపంచ మధుమేహ దినోత్సవం
News November 14, 2025
జక్కన్న.. ఏం ప్లాన్ చేశావయ్యా?

రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా SSMB29 నుంచి ఇవాళ బిగ్ అప్డేట్ రానుంది. దీని కోసం మేకర్స్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. కాగా ఈవెంట్కు వ్యాఖ్యాతలుగా యాంకర్ సుమతో పాటు యూట్యూబర్ ఆశిష్ వ్యవహరిస్తారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో వారితో రాజమౌళి డిస్కషన్స్ చేస్తున్న ఫొటోలు వైరలవ్వగా ‘ఏం ప్లాన్ చేశావయ్యా జక్కన్న’ అంటూ ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.


