News December 3, 2024

వలస కార్మికులకు అండగా ఉంటాం: రామ్మోహన్ నాయుడు

image

AP: విదేశాల్లో చిక్కుకున్న వలస కార్మికులకు అండగా ఉంటామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. బాధితులకు ఇండియాకు రప్పించేందుకు విదేశాంగశాఖ సహాయం కోరతామని చెప్పారు. వారికి అవసరమైన ఫుడ్, ఇతర ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. కాగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, సోంపేట, వజ్రపుకొత్తూరు, కంచిలి, నందిగాంకు చెందిన దాదాపు 30 మంది వలస కార్మికులు సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.

Similar News

News March 24, 2026

ఎస్సీల మతమార్పిడిపై సుప్రీంకోర్టు తీర్పు.. నేపథ్యం ఇదే

image

AP: తనను కొందరు కులం పేరుతో దూషించడంతో పాటు దాడి చేశారని గుంటూరు జిల్లాకు చెందిన పాస్టర్‌ ఆనంద్ 2021లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆరుగురిపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేయగా, FIR కొట్టేయాలంటూ వారు <<19462779>>హైకోర్టుకు<<>> వెళ్లారు. ఆనంద్ పదేళ్లుగా పాస్టర్‌గా పని చేస్తున్నారని కోర్టు గుర్తించింది. కుల ధ్రువీకరణ పత్రం ఉన్నప్పటికీ, మతమార్పిడి తర్వాత ఆ రక్షణ పొందేందుకు అర్హత ఉండదని కోర్టు స్పష్టం చేసింది.

News March 24, 2026

విమానం నుంచి 100M దూరం ఎగిరిపడినా..

image

న్యూయార్క్‌లోని లాగార్డియా ఎయిర్‌పోర్టులో విమానం-ట్రక్కు <<19460968>>ఢీకొనడంతో<<>> ఇద్దరు పైలట్లు చనిపోయారు. ఈ ఘటనలో ఫ్లైట్ అటెండెంట్ సొలాంజ్ మృత్యుంజయురాలిగా నిలిచారు. రన్‌వేపై ల్యాండై 150 KM వేగంతో దూసుకెళ్తోన్న ఫ్లైట్ నుంచి ఆమె దాదాపు 100 మీటర్లు ఎగిరిపడినట్లు అధికారులు తెలిపారు. కాళ్లు, చేతులకు గాయాలతో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. విమానం ముందు భాగం ధ్వంసమైనా ఆమె ప్రాణాలతో ఉండటం అద్భుతమన్నారు.

News March 24, 2026

ఇరాన్ గ్యాస్ స్టేషన్‌పై దాడి.. ట్రంప్ ప్రకటన ఉత్తదేనా?

image

ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లపై 5 రోజుల పాటు దాడులు చేయబోమని ట్రంప్ నిన్న ప్రకటించినా వాస్తవ పరిస్థితి వేరేలా ఉంది. ట్రంప్ ప్రకటన తర్వాత ఇస్‌ఫహాన్ ప్రావిన్స్‌లోని నేచురల్ గ్యాస్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, గ్యాస్ స్టేషన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు చేశాయి. ప్రాణనష్టం లేకపోయినా పలు ఆస్తులు దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ టెన్షన్లతో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 102-103 డాలర్లకు పెరిగింది.