News September 22, 2025
పెన్షన్ల పంపిణీ నిలిపివేస్తాం: సచివాలయ ఉద్యోగ జేఏసీ

AP: ఈనెల 27లోపు తమ డిమాండ్లను పరిష్కరించాలని ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. లేదంటే అక్టోబర్ 1 నుంచి పెన్షన్ల పంపిణీని నిలిపివేస్తామని హెచ్చరించింది. నిరసనలో భాగంగా ఈనెల 23,24,25 తేదీల్లో కలెక్టర్లు, ఇతర అధికారులకు జేఏసీ తరఫున నోటీసులు అందజేస్తామన్నారు. 26,27న ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తున్న వాట్సాప్ గ్రూపుల నుంచి ఉద్యోగులంతా స్వచ్ఛందంగా వైదొలుగుతారని పేర్కొంది.
Similar News
News September 22, 2025
ఏ చర్మానికి ఏ ఫేస్వాష్ వాడాలో తెలుసా?

ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల ఫేస్వాష్లు ఉన్నాయి. వీటిల్లో మీ చర్మానికి సరిపోయేదాన్ని ఎంచుకోవడం ముఖ్యం అంటున్నారు నిపుణులు. హైలురోనిక్ యాసిడ్, గ్లిజరిన్, నియాసినమైడ్ ఉన్న ఫేస్వాష్లు చర్మానికి తేమను అందించి పొడిదనాన్ని తగ్గిస్తాయి. ఆయిలీ స్కిన్ ఉన్నవారు సాలిసిలిక్ యాసిడ్ లేదా టీ ట్రీ ఆయిల్ కలిగిన ఫేస్వాష్, డ్రై స్కిన్ ఉన్నవారు ఆల్మండ్ ఆయిల్, ఆలీవ్ ఆయిల్ ఉన్న ఫేస్వాష్ ఉపయోగిస్తే మంచిది.
News September 22, 2025
ముఖానికి ఫేస్వాష్ ఎందుకు వాడాలంటే?

కాలుష్యం, సూర్యరశ్మి, మేకప్ ప్రభావం ముఖంపై పడుతుంది. కాబట్టి రోజుకు రెండుసార్లు ఫేస్వాష్ చేసుకోవడం ముఖ్యమని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. అయితే చాలామంది ఫేస్వాష్ చెయ్యడానికి సబ్బునే వాడతారు. వాటిలో ఉండే రసాయనాల వల్ల ముఖంపై ఉండే pH దెబ్బతింటుదంటున్నారు నిపుణులు. ఫేస్వాష్లు చర్మాన్ని మృదువుగా, లోతుగా క్లీన్ చేస్తాయి. ఫేస్వాష్ ద్వారా pH బ్యాలెన్స్ సరిగ్గా మెయింటైన్ అవుతుందంటున్నారు నిపుణులు.
News September 22, 2025
రాష్ట్రంపై సైకోల కళ్లు పడకూడదని వేడుకున్నా: మంత్రి అనిత

AP: రాష్ట్రంపై సైకోల కళ్లు పడకూడదని ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మను వేడుకున్నట్లు హోంమంత్రి అనిత వివరించారు. బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడారు. పాలనలో చంద్రబాబు, పవన్, లోకేశ్కు శక్తి, మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకున్నట్లు చెప్పారు. ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వం 20ఏళ్ల పాటు ఉండాలని వేడుకున్నానన్నారు. దుర్గమ్మ దయ అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.