News October 26, 2024
ప్రాణ త్యాగం చేసైనా వక్ఫ్ బిల్లును అడ్డుకుంటాం: మౌలానా ఖలీద్
వక్ఫ్ సవరణ బిల్లును అడ్డుకోవడానికి ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు ప్రాణ త్యాగానికైనా సిద్ధమే అని బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా అన్నారు. ‘ఇది మాకు జీవన్మరణ సమస్య. ప్రతిపాదిత సవరణ బిల్లు అమలును అడ్డుకొని తీరుతాం. అవసరమైతే ముస్లింలు జైల్ భరో కార్యక్రమాలు చేపడతారు’ అని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వమే అత్యధికంగా వక్ఫ్ ఆస్తులను ఆక్రమించిందని మౌలానా ఆరోపించారు.
Similar News
News October 26, 2024
నవంబర్ 4 వరకు ఆ సేవలు నిలిపివేత
AP: భవన నిర్మాణాలు, లేఅవుట్లకు ఆన్లైన్లో పర్మిషన్లు ఇచ్చే పోర్టల్లో ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ నేపథ్యంలో నవంబర్ 4 వరకు ఆన్లైన్ అనుమతుల సేవలు నిలిపివేసినట్లు DPMS డైరెక్టర్ తెలిపారు. సర్వర్ మైగ్రేషన్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
News October 26, 2024
టీమ్ ఇండియాకు బ్యాడ్ డేస్
గత రెండు వారాల్లోనే భారత పురుషుల జట్టు, మహిళల, యువకుల జట్లు ఘోర పరాజయాలు ఎదుర్కొన్నాయి. కివీస్పై మెన్స్ టీమ్ 36 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ కోల్పోయింది. ఆసియా కప్లో ఉమెన్స్ టీమ్ సెమీ ఫైనల్కు వెళ్లలేకపోయింది. దుబాయ్లో జరిగిన ఎమర్జింగ్ టోర్నీ సెమీ ఫైనల్లో పసికూన అఫ్గానిస్థాన్పై భారత యువ జట్టు ఓడి ఫైనల్కు చేరలేకపోయింది. దీంతో భారత జట్టుకు ఇవి మంచి రోజులు కావంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
News October 26, 2024
సన్న వడ్లకు రూ.500 బోనస్.. క్యాబినెట్ ఆమోదం
TG: సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ములుగులో సమ్మక్క-సారలమ్మ వర్సిటీకి భూకేటాయింపునకు మంత్రివర్గం ఆమోదించింది. హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధి పెంచాలని నిర్ణయించింది. ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.