News June 24, 2024
మహిళలకు వ్యాపారాల్లో తోడ్పాటునందిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

TG: రాష్ట్రాభివృద్ధిలో మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర ఎంతో కీలకమని, వారికి వ్యాపారాల్లో తోడ్పాటునందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి మహిళలకు ప్రభుత్వం సహకారం ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వం రూపొందించే పారిశ్రామిక విధానంలో మహిళలకు తగిన ప్రాధాన్యమిస్తామన్నారు.
Similar News
News December 6, 2025
రాకెట్ వేగంతో దూసుకుపోతున్న భారత్ ‘ఫిన్టెక్’

స్కాన్.. పే.. డన్. ఈ భారత UPI చెల్లింపుల టెక్నాలజీ రాకెట్ వేగంతో గ్లోబల్ ఆధిపత్యం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఫ్రాన్స్, సింగపూర్, UAE, ఖతర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మారిషస్లో ఇది పనిచేస్తోంది. EAST ASIA సహా మరో 8 దేశాల్లో దీని అమలుకు చర్చిస్తున్నట్లు ఫైనాన్షియల్ SEC నాగరాజు తెలిపారు. వరల్డ్ వైడ్గా 20+కంట్రీలను UPI ఎనేబుల్డ్ చేయాలన్నది లక్ష్యం. UPI USERS 50CRకి చేరగా INDIAలో 49CR ఉన్నారు.
News December 6, 2025
గవర్నర్తో సీఎం చంద్రబాబు భేటీ

AP: విజయవాడలోని లోక్భవన్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, పెట్టుబడులను ఆకర్షించేందుకు చేస్తోన్న కృషిని CM వివరించినట్లు తెలుస్తోంది. అలాగే రాజధాని నిర్మాణ పనుల పురోగతిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
News December 6, 2025
హిట్ మ్యాన్@ 20,000 రన్స్

SAతో మూడో వన్డేలో రోహిత్ శర్మ కీలక మైలురాయిని చేరుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్(టెస్టు, వన్డే, T20)లో 20,000 పరుగులు చేసిన నాలుగో ఇండియన్ ప్లేయర్గా నిలిచారు. కేశవ్ వేసిన 14 ఓవర్ నాలుగో బంతికి సింగిల్ తీసి ఈ ఘనత సాధించారు. సచిన్(34,357), కోహ్లీ(27,910), ద్రవిడ్(24,064) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. కాగా ప్రస్తుత మ్యాచ్లో భారత్ నిలకడగా ఆడుతోంది. క్రీజులో జైస్వాల్(38), రోహిత్(50) ఉన్నారు.


