News December 17, 2024

పేర్ని నానిపై చర్యలు తీసుకుంటాం: మంత్రి కొల్లు

image

AP: మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబమంతా పరారీలో ఉందని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పేదల బియ్యం బొక్కేసి నాని నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. YCP అంటేనే దొంగల పార్టీ అని ఆయన ఎద్దేవా చేశారు. మరోవైపు కాకినాడ పోర్టులోని స్టెల్లా షిప్‌లో 1,320 టన్నుల PDS బియ్యం ఉన్నాయని కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. ఈ బియ్యాన్ని షిప్ నుంచి అన్‌లోడ్ చేయించి సీజ్ చేస్తామన్నారు.

Similar News

News October 30, 2025

జనగామ: రైతులకు అండగా ఉండండి: కలెక్టర్

image

వర్షాల నేపథ్యంలో రైతులకు అండగా ఉండాలని జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్, ఆర్డీవోలు, ఎమ్మార్వోలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు.

News October 30, 2025

అజహరుద్దీన్‌‌కు మంత్రి పదవి.. మీరేమంటారు?

image

TG: అజహరుద్దీన్‌ మంత్రి కావడానికి టైం ఫిక్స్ అయింది. కాగా మంత్రివర్గ విస్తరణ సమయాల్లో గతంలో లేనంతగా కాంగ్రెస్ తాజా నిర్ణయం కాక రేపుతోంది. దేశ ద్రోహికి మంత్రి పదవి ఎలా ఇస్తారని BJP.. ఓ సామాజికవర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ దిగజారిందని BRS ధ్వజమెత్తాయి. అయితే అజహరుద్దీన్ క్రికెట్‌లో దేశానికి పేరు తెచ్చారని, ఆయనకు పదవి రాకుండా ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని కాంగ్రెస్ చెబుతోంది. దీనిపై మీరేమంటారు.

News October 30, 2025

CBSE పరీక్షల తేదీలు విడుదల

image

వచ్చే ఏడాది జరిగే టెన్త్, 12వ తరగతి పరీక్షల ఫైనల్ డేట్ షీట్‌ను CBSE విడుదల చేసింది. రెండు క్లాసులకూ ఫిబ్రవరి 17 నుంచి పరీక్షలు మొదలవుతాయి. టెన్త్ విద్యార్థులకు మార్చి 10వ తేదీ వరకు, 12వ క్లాస్ స్టూడెంట్లకు ఏప్రిల్ 9 వరకు జరుగుతాయి. రోజూ ఉదయం 10.30 గంటలకు ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.