News December 11, 2024
ప్రజలకు ఉపయోగపడే పాలసీలు తీసుకొస్తాం: పవన్ కళ్యాణ్

AP: ప్రజలకు అవసరమైన పాలసీలు మాత్రమే తీసుకొస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం నుంచి చాలా ఆశిస్తున్నారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులదే. అందుకే ఐఏఎస్, ఐపీఎస్లు బాధ్యతగా పనిచేయాలి. మమ్మల్ని నమ్మి ప్రజలు మాకు భారీ విజయం కట్టబెట్టారు. వారికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 28, 2025
గొర్రెల్లో బొబ్బ రోగం(అమ్మతల్లి) ఎలా గుర్తించాలి?

ఇది ఏడాదిలో ఏ కాలంలోనైనా, ఏ ప్రాంతాల్లో గొర్రెలకైనా సోకే అంటువ్యాధి. ఇది సోకిన గొర్రెలు ఆకస్మికంగా నీరసంగా మారతాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగి కళ్లు ఎర్రబడి నీరు కారతాయి. వ్యాధి సోకిన 1,2 రోజుల్లో గొర్రె శరీర భాగాలపై దద్దుర్లు ఏర్పడి క్రమేణా పెద్దవై, బొబ్బలుగా మారి చీము పట్టి నలుపు రంగులోకి మారతాయి. వ్యాధి తీవ్రత బట్టి సుమారు 20-30% గొర్రెలు మరణిస్తాయి. ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స అందించాలి.
News November 28, 2025
తిరుమల శ్రీవారి పుష్పాలను ఏం చేస్తారో తెలుసా?

తిరుమల శ్రీవారి సేవ కోసం రోజుకు కొన్ని వందల కిలోల పూలు వాడుతారు. మరి వాటిని ఏం చేస్తారో మీకు తెలుసా? పూజ తర్వాత వాటిని బయట పడేయరు. తిరుపతికి తరలిస్తారు. అక్కడ శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనంలోని పూల ప్రాసెసింగ్ యూనిట్కు పంపుతారు. ఈ యూనిట్లో ఈ పూల నుంచి పరిమళభరితమైన అగరబత్తులు, ఇతర సుగంధ ద్రవ్యాలను తయారుచేస్తారు. తద్వారా పూల పవిత్రతను కాపాడుతూనే, వాటిని ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మారుస్తారు.
News November 28, 2025
2026 సెలవుల జాబితా విడుదల

కేంద్రం 2026 సంవత్సరానికి అధికారిక <


