News July 14, 2024
ఇండియా మా దేశానికి రాకపోతే T20WC-26 నుంచి వైదొలుగుతాం: PCB

వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని పూర్తిగా తమ దేశంలోనే నిర్వహించాలని PCB నిర్ణయించుకుంది. ఈ టోర్నీ కోసం పాకిస్థాన్కు టీమ్ ఇండియా రాకపోతే.. 2026లో భారత్- శ్రీలంక నిర్వహించే T20WC నుంచి వైదొలగాలని భావిస్తోంది. ఈ నెల 19 నుంచి 22 వరకు కొలంబోలో జరిగే ICC వార్షిక సదస్సులో హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనలను వ్యతిరేకించనున్నట్లు సమాచారం. పాక్లో పర్యటించబోమని BCCI వర్గాలు చెబుతున్న విషయం తెలిసిందే.
Similar News
News December 9, 2025
స్వరాష్ట్ర కలను సోనియా సాకారం చేశారు: రేవంత్

TG: సరిగ్గా ఇదే రోజున 2009లో తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చేసిన ప్రకటన రాష్ట్ర ప్రజలకు సంతోషాన్నిచ్చిందని సీఎం రేవంత్ అన్నారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్వరాష్ట్ర కలను సోనియా సాకారం చేశారన్నారు. ఆ కారణంగానే ఈ రోజున తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో ఆయన వర్చువల్గా పాల్గొన్నారు.
News December 9, 2025
ICSILలో ఉద్యోగాలకు అప్లై చేశారా?

ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(ICSIL)లో 6 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి డిసెంబర్ 9 ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 10న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.590. నెలకు జీతం రూ.24,356 చెల్లిస్తారు. వెబ్సైట్: https://icsil.in
News December 9, 2025
ఎయిర్పోర్టుల్లో తనిఖీలకు రామ్మోహన్ నాయుడు ఆదేశాలు

దేశంలోని మేజర్ ఎయిర్పోర్టుల్లో తనిఖీలు చేసి ఎయిర్లైన్ ఫంక్షనింగ్, ప్రయాణికుల సమస్యలు తెలుసుకోవాలని అధికారులను సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. ప్రయాణికులతో నేరుగా మాట్లాడి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని చెప్పారు. డిప్యూటీ సెక్రటరీ, డైరెక్టర్, జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులు హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై సహా మేజర్ ఎయిర్పోర్టుల్లో తనిఖీలు నిర్వహించనున్నారు.


