News July 26, 2024
ఎంతో మంది త్యాగాలతో కార్గిల్ యుద్ధాన్ని గెలిచాం: మోదీ

కార్గిల్ యుద్ధంలో పాక్పై గెలిచి పాతికేళ్లు పూర్తైన సందర్భంగా కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని మోదీ నివాళులర్పించారు. ‘అమరుల త్యాగఫలితంతో ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ను జరుపుకొంటున్నాం. మన జవాన్లు ఎంతో సాహసంతో పోరాడారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు. శ్రీనగర్, లద్దాక్ను అభివృద్ధి చేసుకుంటున్నాం. టన్నెల్ పూర్తయితే లద్దాక్ మరింత వేగంగా పురోగమిస్తుంది’ అని పేర్కొన్నారు.
Similar News
News February 4, 2026
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈనెల 7, 8 తేదీల్లో ఆయన BJP అభ్యర్థుల విజయానికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు స్నేహపూర్వక పోటీ చేస్తున్నట్లు జనసేన వర్గాలు స్పష్టం చేశాయి.
News February 4, 2026
నామినేషన్ల పర్వం సమాప్తం.. నేటి నుంచి హోరెత్తనున్న ప్రచారం!

TG: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసి, అభ్యర్థులపై స్పష్టత రావడంతో నేటి నుంచి ప్రచారం హోరెత్తనుంది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. FEB 16న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లతో పాటు కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరగనుంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ఓటర్ల వద్దకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
News February 4, 2026
ట్రేడ్ డీల్ ఖరారు.. అమెరికాలో జైశంకర్ బిజీ

IND-US ట్రేడ్ డీల్ ఖరారవడంతో దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు విదేశాంగ మంత్రి జైశంకర్ రంగంలోకి దిగారు. వాషింగ్టన్లో US సెక్రటరీ రూబియో, ట్రెజరీ సెక్రటరీ బెసెంట్లతో భేటీ అయ్యారు. క్రిటికల్ మినరల్స్ అన్వేషణ, మైనింగ్, ప్రాసెసింగ్తో సహకారంపై చర్చించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇంధన భద్రత, కొత్త ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది.


