News December 27, 2024
బలహీనపడిన అల్పపీడనం.. ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దాదాపు 10 రోజుల తర్వాత బలహీనపడింది. ఉపరితల ఆవర్తనం కారణంగా ఇవాళ APలోని ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య , చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ పలుచోట్ల వానలు పడే అవకాశం ఉందంది. కాగా ఇక వచ్చే వేసవి వరకు అల్పపీడనాలు, భారీ వర్షాలకు ఛాన్స్ లేదని పేర్కొంది.
Similar News
News September 23, 2025
PHOTO GALLERY: అమ్మవారి వైభవం

తెలుగు రాష్ట్రాల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివిధ రూపాల్లో వెలిగిపోతున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. ఆ జగన్మాత ఆశీస్సులు పొందుతూ పరవశించి పోతున్నారు. పలు జిల్లాల్లో అమ్మవారి అలంకారాలను ఫొటోల్లో వీక్షించి తరించండి.
News September 23, 2025
స్పెషల్ బస్సుల్లోనే 50% అదనపు ఛార్జీలు: సజ్జనార్

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా 7 వేలకు పైగా బస్సులను నడుపుతున్నామని TGSRTC ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రత్యేక బస్సుల్లోనే 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నామని, మిగతా బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉన్నాయని పేర్కొన్నారు. ‘బస్సులు తిరుగు ప్రయాణంలో ఖాళీగా వస్తున్నాయి. డీజిల్, మెయింటెనెన్స్ కోసం 50% అదనంగా వసూలు చేస్తున్నాం. ఇది కొత్త పద్ధతి కాదు.. 2003లో ఇచ్చిన GOనే అమలు చేస్తున్నాం’ అని తెలిపారు.
News September 23, 2025
4300 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి చర్యలు: లోకేశ్

AP: రాష్ట్ర వర్సిటీల్లోని 4300 ప్రొఫెసర్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి లోకేశ్ కౌన్సిల్లో వెల్లడించారు. దీనిపై ఉన్న వివాదాలను పరిష్కరించి ముందుకెళ్తామన్నారు. గతంలో అనుమతి లేకుండా కడప YSR ఆర్కిటెక్చర్, ఫైన్ఆర్ట్స్ వర్సిటీలో అడ్మిషన్లు చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని, వాటిని తాము పరిష్కరించామని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఉండడం వల్ల గత తప్పులను సరిదిద్దుతున్నామని వివరించారు.