News March 15, 2025

Weather Report: బాబోయ్ ఎండలు.(జాగ్రత్త)

image

జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గత 10రోజులుగా పోల్చుకుంటే 3.3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సుమారుగా 42డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎండ తీవ్రతతో పాటు వడగాలు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు జాగ్రత్తగా ఉండాలని నిపుణలు సూచిస్తున్నారు.

Similar News

News November 1, 2025

కాశీబుగ్గ ప్రమాదంపై శ్రీకాకుళం కలెక్టరేట్లో కంట్రోల్ రూం

image

కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 10 మంది వరకు చనిపోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. క్షతగాత్రులు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూంను జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు. ప్రమాదంపై సమాచారం కొరకు 08942 240557 కంట్రోల్ రూం నంబర్‌ను సంప్రదించాలని అధికారులు వెల్లడించారు.

News November 1, 2025

డోన్ వద్ద బోల్తా పడ్డ MPDO వాహనం

image

పింఛన్ల పంపిణీ విధులను ముగించుకుని డోన్ వైపు వస్తుండగా చింతలపేట సమీపంలో ఎంపీడీవో వెంకటేశ్వర్ రెడ్డి, ఏఈ నారాయణ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. శనివారం ఉదయం వాహనం నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎంపీడీవో, ఏఈ నారాయణ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.

News November 1, 2025

GWL: విద్యార్థులకు అస్వస్థత.. హాస్టల్ వార్డెన్ సస్పెండ్.!

image

గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం ధర్మవరం బీసీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ కారణంగా 54 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ తీవ్రంగా స్పందించారు. హాస్టల్ వార్డెన్‌ జయరాములును తక్షణమే <<18166938>>సస్పెండ్<<>> చేయాలని అధికారులను ఆదేశించారు. అస్వస్థత జరిగిన సమయంలో వార్డెన్ అందుబాటులో లేకపోవడం, విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.