News February 11, 2025

WGL: అన్నదాతకు ఊరట.. రూ.100 పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు పత్తి ధరలు రైతన్నలకు స్వల్ప ఊరటనిచ్చాయి. 15 రోజుల అనంతరం నేడు మార్కెట్లో పత్తి ధర రూ.7వేల మార్క్ దాటింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,960 పలకగా.. నేడు రూ.7,060 పలికినట్లు అధికారులు తెలిపారు. ఒకరోజు వ్యవధిలోనే రూ.100 పెరగడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 8, 2025

ఈ సింప్టమ్స్ ఉంటే మహిళలకు గుండెపోటు ముప్పు

image

* డెంటల్ ప్రాబ్లమ్స్ లేదా టెంపోరోమాండిబ్యులర్ జాయింట్ సమస్య అనిపించేలా దవడ నొప్పి
* పుల్లటి త్రేన్పులు, తరచూ వికారంగా ఉండడం, వాంతులు.
* అజీర్ణ సమస్యలు. ఫుడ్ పాయిజన్ కారణమనే భావన.
* హార్ట్‌బీట్‌లో హెచ్చుతగ్గులు.
* వెన్నెముక పైన, భుజం బ్లేడ్‌ల మధ్యలో, బ్రెస్ట్ కింది భాగంలో నొప్పి.
* శారీరక శ్రమ లేకున్నా చెమటలు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.
* ఈ సింప్టమ్స్ ఉంటే మహిళలకు గుండెపోటు ముప్పు

News December 8, 2025

డెలివరీ తర్వాత జరిగే హార్మోన్ల మార్పులివే..!

image

ప్రసవం తర్వాత స్త్రీల శరీరంలోని హార్మోన్లలో మార్పులు వస్తుంటాయి. డెలివరీ అయిన వెంటనే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలు పడిపోతాయి. దీంతో మొదటి 2 వారాల్లో చిరాకు, ఆందోళన, లోన్లీనెస్, డిప్రెషన్ వస్తాయి. అలాగే ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ ఎక్కువగా ఉండటంతో యోని పొడిబారడం, లిబిడో తగ్గడం వంటివి జరుగుతాయి. దీంతో పాటు స్ట్రెస్ హార్మోన్, థైరాయిడ్ డిస్‌ఫంక్షన్ వంటివి కూడా జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

News December 8, 2025

అనంత: అనాధ పిల్లలకు హెల్త్ కార్డుల పంపిణీ

image

అనాధ పిల్లల కోసం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం జిల్లాలోని అనాధ పిల్లలకు హెల్త్ కార్డులను తయారు చేయించింది. అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఈ కార్డులను పంపిణీ చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఈ సేవను అందిస్తున్న సంగతి తెలిసిందే.