News April 13, 2025

WGL: అర్ధరాత్రి దారుణ హత్య..!

image

వరంగల్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లిలో బానోతు కొమ్మలును గుర్తుతెలియని దుండగులు శనివారం అర్ధరాత్రి కత్తితో పొడిచి పరారయ్యారని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 25, 2025

మెదక్: పేదల దేవుళ్లకు 6దశాబ్దాలుగా పూజలు

image

కమ్యూనిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొని అకాల మరణం పొందిన కామ్రెడ్ కేవల్ కిషన్, లక్ష్మయ్యలు పేదల దేవుళ్లయ్యారు. పీడితుల విముక్తి నుంచి పోరాడి కూరుకుపోయిన భూస్వామ్యాన్ని కూల్చి సమాజ సమానత్వానికై పోరాడారు. కేవల్ కిషన్, ఆయన మిత్రుడు లక్ష్మయ్య ప్రమాదంలో మరణించి ఆరు దశాబ్దాలు గడిచింది. చేగుంట మండలం పొలంపల్లిలో గుడి కట్టి ఆరాధిస్తున్నారు. వారి వర్దంతి సందర్బంగా రేపు జాతర జరగనుంది.

News December 25, 2025

పశువుల్లో ‘జోన్స్’ వ్యాధి లక్షణాలు – జాగ్రత్తలు

image

ఈ వ్యాధి సోకిన పశువు చర్మం మొద్దుబారడం, బక్కచిక్కడం, వెంట్రుకలు ఊడటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఫలితంగా పశువులకు ఆకలి ఉండదు. దీంతో శరీరం అంతా నీరసించి లేవలేని స్థితికి చేరుతుంది. ఈ వ్యాధిని నిర్మూలించాలంటే అంత సులువు కాదు. ఇది దీర్ఘకాలిక ప్రక్రియ. పశువు యొక్క స్థితిని బట్టి సెలైన్స్, మినరల్స్, విటమిన్స్ ఎక్కువ ఉండే ఆహారం అందించాలి. వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే పశు వైద్యుడిని సంప్రదించాలి.

News December 25, 2025

ఇస్రో సైంటిస్ట్ నందిని హరినాథ్ గురించి తెలుసా?

image

కర్ణాటకలోని తుప్పూరు కి చెందిన డాక్టర్ కె. నందిని పీహెచ్‌డీ పూర్తయిన వెంటనే ఇస్రోలో ఉద్యోగంలో చేరారు. 20ఏళ్లుగా ఇస్రోలో ఉద్యోగం చేస్తున్న ఆమె 14పైగా మిషన్లలో పనిచేశారు. ప్రాజెక్ట్ మేనేజర్, మిషన్ డిజైనర్‌గా వర్క్ చేయడంతో పాటు మంగళయాన్ ప్రాజెక్ట్‌లో డిప్యూటీ ఆపరేషన్స్ డైరక్టర్‌గా ఈమె వ్యవహరించారు. అలాగే ఎన్నో సత్కారాలు పొందడంతో పాటు 2015లో ‘ఇండియా టుడే ఉమెన్ ఇన్ సైన్స్’ అవార్డు కూడా అందుకున్నారు.