News April 13, 2025
WGL: అర్ధరాత్రి దారుణ హత్య..!

వరంగల్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లిలో బానోతు కొమ్మలును గుర్తుతెలియని దుండగులు శనివారం అర్ధరాత్రి కత్తితో పొడిచి పరారయ్యారని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 26, 2025
గుంటూరు యార్డులో ‘ఘాటైన’ ధరలు

గుంటూరు మిర్చి యార్డుకు బుధవారం 90 వేల బస్తాల ఏసీ సరుకు పోటెత్తింది. మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రత్యేకంగా ‘యల్లో రకం’ మిర్చి ధర ఘాటెక్కింది. కిలో రూ.200 నుంచి రూ.250 వరకు పలికి రికార్డు సృష్టించింది. ముఖ్యమైన ధరలు (కిలోకు) 2043 ఏసీ: గరిష్ఠంగా రూ.200. నంబర్-5, 341 రకాలు రూ.180 వరకు, బంగారం, బుల్లెట్ రూ.175. తేజా ఏసీ రూ.120-152, ఇక సీడు తాలు రూ.60-90 వరకు ధర పలికాయి.
News November 26, 2025
‘పీఎం కుసుమ్’తో సాగులో సోలార్ వెలుగులు

TS: వచ్చే 4 ఏళ్లలో వ్యవసాయ బోర్లకు పెద్ద ఎత్తున సౌర విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. PM కుసుమ్ పథకం కింద వచ్చే నాలుగేళ్లలో 28.60 లక్షల బోర్లకు రాయితీలు, 4,500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను రైతు సంఘాలతో ఏర్పాటుకు అనుమతివ్వాలని కేంద్రాన్ని TG ప్రభుత్వం కోరింది. అలాగే రైతులు తమ పొలాల్లో సొంతంగా ఏర్పాటు చేసుకునే సోలార్ ప్యానల్స్కు రాయితీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది.
News November 26, 2025
ధర్మవరం పట్టు వస్త్రంపై అయోధ్య రాముడు

ధర్మవరం పట్టణానికి చెందిన పట్టు చీరల వ్యాపారి జింకా రామాంజనేయులు, అయోధ్య రాముడిపై భక్తితో ప్రత్యేక వస్త్రాన్ని తయారు చేయించారు. అయోధ్య ఆలయ గర్భగుడిలో ఉన్న రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి చిత్రాలను పట్టు వస్త్రంపై నేయించారు. నెల రోజుల క్రితమే ఆలయ కమిటీకి అందజేయగా, నిన్న ధ్వజారోహణ సందర్భంగా అయోధ్యలో ప్రదర్శించినట్లు ఆయన తెలిపారు.


