News April 1, 2025
WGL: ఆందోళనలో ‘మావో’ కుటుంబాలు

ఛత్తీస్గఢ్లో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేతలు నేలకొరుగుతున్నారు. ఇక్కడి నుంచి సుమారు 21 మంది కీలక నేతలు మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నట్లు ఇప్పటికే కేంద్ర హోంశాఖ వివరాలు ఆరా తీసినట్లు తెలిసింది. ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్న ఎన్ కౌంటర్లతో జిల్లాలోని వారి కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఓరుగల్లు వాసులే ఉండడం గమనార్హం.
Similar News
News September 15, 2025
SDPT: ‘స్వచ్ఛత హి సేవా’ పోస్టర్ ఆవిష్కరణ

‘స్వచ్ఛత హి సేవా-2025’ కార్యక్రమం ద్వారా జిల్లాలోని అన్ని గ్రామాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సిద్దిపేట కలెక్టర్ హైమావతి తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. గ్రామాల్లోని ప్రజల సహకారంతో శ్రమదానం, వ్యర్థాల తొలగింపు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈఓతో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News September 15, 2025
బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం: HYD కలెక్టర్

వరద కారణంగా మృతిచెందిన కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇస్తామని కలెక్టర్ హరిచందన వెల్లడించారు. బాడీ దొరికిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాత ఇళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వరద ఉద్ధృతి పెరిగే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొన్ని నాళాలపై నిర్మాణాలు జరుగుతుండటంతో ప్రమాదాలు తలెత్తుతున్నాయని, అలాంటి నిర్మాణాలపై చర్యలు తప్పనిసరి అని కలెక్టర్ స్పష్టం చేశారు.
News September 15, 2025
సంగారెడ్డి: ఐటీఐల్లో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు దరఖాస్తు గడువును ఈనెల 30 వరకు పొడిగించినట్లు ఐటీఐ కన్వీనర్ తిరుపతి రెడ్డి తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు http://iti.telangana.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇది చివరి అవకాశమని, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.