News March 24, 2025

WGL: ఆ ప్రాంతంలో MLA ఉప ఎన్నికలు అనివార్యమేనా?

image

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు ఈ కేసును ధర్మాసనం విచారించనుంది. ఈ క్రమంలో స్టేషన్ ఘనపూర్‌లో BRS నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరిపై అనర్హత వేటు పడుతుందా? స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? స్టే.ఘనపూర్‌లో ఉప ఎన్నికలు జరుగుతాయేమోనని స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?

Similar News

News December 6, 2025

పోస్టల్ బ్యాలెట్ వినియోగించాలి: కలెక్టర్ రాహుల్ శర్మ

image

మొదటి విడత ఎన్నికల సిబ్బంది ఈ నెల 6 నుంచొ 8వ తేదీ వరకు ఎంపీడీవో కార్యాలయాల్లోని ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. శనివారం రేగొండ, మొగుళ్లపల్లి, గణపురం, కొత్తపల్లి గోరి మండలాల్లోని రైతు వేదికల్లో జరిగే శిక్షణ కార్యక్రమానికి సిబ్బంది తప్పక హాజరు కావాలని ఆయన ఆదేశించారు.

News December 6, 2025

NLG జిల్లాలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో బిసి., ఇబిసి, ఎస్సి, ఎస్టి అభ్యర్థులకు Awareness programme, IELTS కొరకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎస్పీ రాజ్ కుమార్ తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అర్హులైన అభ్యర్థులు ఈనెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. website:tgbcstudycircle.cgg.gov.in నందు అన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు.

News December 6, 2025

తొర్రూరు: కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి

image

స్థానిక ఎన్నికల తరుణంలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. తొర్రూరు మండలం మడిపల్లికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, సర్పంచ్ అభ్యర్థి వేల్పుల వెంకన్న బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. అనంతరం తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.