News February 26, 2025

WGL: ఈనెల 27న డయల్ యువర్ డీఎం కార్యక్రమం

image

ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు సలహాలు, సూచనలు స్వీకరించేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్-1 డిపో మేనేజర్ వంగల మోహన్ రావు తెలిపారు. ఈనెల 27న ఉ.9 నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రయాణికులు 9959226047 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు, సలహాలు, సూచనలు తెలపాలని కోరారు.

Similar News

News December 17, 2025

ఈనెల 21న పల్స్ పోలియో: జేసీ

image

ఈనెల 21న పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేసి, ఐదేళ్లలోపు ప్రతీ చిన్నారికి పోలియో చుక్కలు వేయాలని జేసీ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 3.52 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యంగా 1,600 బూత్‌లు, మొబైల్ యూనిట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా ఇంటింటి సర్వే, ట్రాన్సిట్ పాయింట్లలో ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు.

News December 17, 2025

నువ్వుల చేనులో మనుషులతో కలుపు నివారణ వల్ల లాభాలు

image

నువ్వుల పంటలో కలుపు ప్రధాన సమస్యగా ఉంటుంది. పంట విత్తిన 15-20 రోజుల లోపు చేనులో అదనపు మొక్కలను తొలగించాలి. విత్తిన 25-30 రోజుల తర్వాత మందులతో కలుపును నివారించకుండా మనుషులతో కలుపు తీయించాలి. దీని వల్ల కలుపు మొక్కలు నశించడమేకాకుండా భూమి గుల్లబారి ఎక్కువ తేమ భూమిలో నిల్వ ఉంటుంది. ఫలితంగా పంట త్వరగా నీటి ఎద్దడికి గురికాదు. విత్తనాలను వరుసల్లో విత్తితే చేనులో కలుపు తీయడానికి అనుకూలంగా ఉంటుంది.

News December 17, 2025

నాగర్‌కర్నూల్ జిల్లాలో తొలి సర్పంచ్ ఫలితం ఇక్కడే..!

image

లింగాల మండలంలోని కొత్తచెరువు తండా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారు అభ్యర్థి కాట్రావత్ దేవి ఘనవిజయం సాధించారు. బుధవారం వెలువడిన ఫలితాల్లో ఆమె తన సమీప అభ్యర్థిపై 120 ఓట్ల మెజారిటీతో సర్పంచ్‌గా గెలుపొందారు. వార్డుల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగింది. మొత్తం 8 వార్డులకు గాను 7 కాంగ్రెస్ మద్దతుదారులు కైవసం చేసుకోగా, మరో వార్డు సభ్యుడు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.