News March 10, 2025
WGL: ఉదయం పొగమంచు, మధ్యాహ్నం ఎండ

వరంగల్ జిల్లాలోని పలు చోట్ల నేడు పొగమంచు కమ్ముకుంది. ఈ క్రమంలోనే నెక్కొండ మండలంలో ఈరోజు తెల్లవారుజామున పొలం పనులకు, స్కూళ్లకు, అవసరాల నిమిత్తం బయటికి వెళ్లేవారు ఇబ్బంది పడ్డారు. అలాగే మధ్యాహ్నం సమయంలో భానుడు సైతం తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడని, ఎండ దంచి కొడుతుందని ప్రజలు తెలుపుతున్నారు. మండలంలో విచిత్ర వాతావరణం నెలకొంటుందని చెబుతున్నారు.
Similar News
News October 28, 2025
10లక్షల మందికి యోగా గురువు ‘నానమ్మల్’

యోగాతోనే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని నమ్మిన నానమ్మల్ అనేక పురాతన యోగా శాసనాలను భావితరాలకు పంచారు. 1972లో యోగాసెంటర్ ప్రారంభించి 10L మందికిపైగా యోగా నేర్పారు. వారు దేశవిదేశాల్లో యోగాగురువులుగా స్థిరపడ్డారు. ఆమె చేసిన కృషికిగాను 2016లో కేంద్ర ప్రభుత్వం నారీశక్తి, 2019లో పద్మశ్రీతో సత్కరించింది. 99 ఏళ్ల వయసులో మరణించిన ఆమె ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
✍️ ఉమెన్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>కి వెళ్లండి.
News October 28, 2025
ICA అధ్యక్షురాలు శాంతా రంగస్వామి గురించి తెలుసా?

భారత క్రికెట్ సంఘం(ICA) అధ్యక్షురాలిగా భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి ఎన్నికయ్యారు. చెన్నైలో జన్మించిన శాంత ఆల్రౌండర్గా 1976-1991 మధ్య కాలంలో భారత జట్టుకు ఆడారు. కెరియర్లో 16 టెస్టులు మాత్రమే ఆడిన ఆమె.. న్యూజిలాండ్పై చరిత్రాత్మక విజయంలో భాగమయ్యారు. 8 మ్యాచులకు కెప్టెన్గా వ్యవహరించారు. మహిళా క్రికెట్కు విశేష సేవలందించిన ఆమెకు 1976లో అర్జున అవార్డు లభించింది.
News October 28, 2025
HYD: రూ.168 కోట్లతో హైడ్రాలాజికల్ సెంటర్

HYDలో దాదాపు రూ.168 కోట్లతో నేషనల్ హైడ్రాలాజికల్ ప్రాజెక్టు కింద స్టేట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి ఆటోమేటిక్ వాటర్ లెవెల్ రికార్డ్స్ ఏర్పాటు, జలాశయాల్లో పూడికతీత, సర్వేల నిర్వహణ, ప్రాజెక్టుల వద్ద సిస్టం ఏర్పాటు యంత్ర సమీకరణ తదితర వాటిపై చర్యలు తీసుకుంటారని తెలిపారు. దీనికి మొత్తం కేంద్రమే నిధులు అందించనుంది.


