News February 25, 2025
WGL: ఎత్తుకు పైఎత్తులు.. మిగిలింది ఒక్కరోజే!

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ప్రచారానికి ఒక్క రోజే మిగిలి ఉండటంతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక కొంతమంది తాయిలాలు పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా కొంతమంది అభ్యర్థులు రెండో ప్రాధాన్యత ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
Similar News
News February 26, 2026
మా ఫోకస్ టీమ్ఇండియా కాదు: జింబాబ్వే స్టార్ ఇవాన్స్

T20 WC S-8లో భాగంగా భారత్తో నేడు జరగనున్న కీలక పోరుపై జింబాబ్వే స్టార్ బ్రాడ్ ఇవాన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము టీమ్ఇండియాపై కాకుండా తమ సొంత ప్రణాళికపైనే ఫోకస్ పెట్టామని స్పష్టం చేశారు. భారత్ ప్రపంచంలోనే బెస్ట్ టీమ్స్లో ఒకటని.. అందుకే గ్రౌండ్లో 100% శ్రమించి ఆడతామని తెలిపారు. లెఫ్ట్ హ్యాండర్లతో నిండిన ఇండియా టాప్ ఆర్డర్ను కట్టడి చేసేందుకు ప్రత్యేక ప్లాన్స్ ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.
News February 26, 2026
కామారెడ్డి: ఓడిన వారికి అప్పులే!

ఎన్నికల జాతర ముగిసింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు తమకున్న స్థలాలు తాకట్టు పెట్టారు. నమ్మబలికిన ఓటర్ల మాటలు నమ్మి లక్షల రూపాయలు గుమ్మరించారు. గెలుపుపై ధీమా కల్పించిన నేతలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. అభ్యర్థులను గాలికి వదిలేసి గెలిచిన వారి చెంతకు చేరుతున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. డబ్బుతో ఓట్లను కొనే వ్యవస్థ ఉన్నంత కాలం ఇలాంటి విషాదాలు పునరావృతమవుతూనే ఉంటాయి.
News February 26, 2026
మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్గా హరిప్రియ

ఉమ్మడిజిల్లాలో రెవెన్యూశాఖ అధికారులు బదిలీఅయ్యారు. మేడ్చల్ DROగా విధులు నిర్వహిస్తున్న JLB హరిప్రియను మహబూబ్ నగర్ జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్గా నియమితులయ్యారు. వెయిటింగ్లో ఉన్న అదనపుకలెక్టర్ పద్మజారాణి గద్వాల DROగా నియమితులయ్యారు. గద్వాల హౌసింగ్ PDగా పనిచేస్తున్న శ్రీనివాసరావు RDOగా నియామకం కాగా, RDOగా పనిచేస్తున్న అలివేలు హౌసింగ్ PDగా నియమితులయ్యారు.


