News February 25, 2025
WGL: ఎత్తుకు పైఎత్తులు.. మిగిలింది ఒక్కరోజే!

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ప్రచారానికి ఒక్క రోజే మిగిలి ఉండటంతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక కొంతమంది తాయిలాలు పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా కొంతమంది అభ్యర్థులు రెండో ప్రాధాన్యత ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
Similar News
News January 5, 2026
పార్వతీపురం: ‘ప్రతి ఫిర్యాదుకు నాణ్యమైన పరిష్కారం చూపడమే లక్ష్యం’

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఆదేశించారు. సోమవారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో తాజాగా నిర్వహించిన వారాంతపు నివేదికల సమీక్షా సమావేశంలో వివిధ శాఖల పనితీరును విశ్లేషించారు.ప్రజల నుంచి సేకరించిన ప్రతి అర్జీని, అదే వారం శనివారం సాయంత్రానికి కచ్చితంగా పూర్తి చేయాలని అధికారులు గడువు విధించారు.
News January 5, 2026
మళ్లీ పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు గంటల వ్యవధిలోనే <<18766451>>మళ్లీ<<>> పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ మొత్తం రూ.2,020 పెరిగి రూ.1,37,840కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,850 ఎగబాకి రూ.1,26,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.8వేలు పెరిగి రూ.2,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News January 5, 2026
ఇరుసుమండ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా!

ఇరుసుమండలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. దీనిపై కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద ప్రాంతానికి సమీపంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు. లీక్ ను నియంత్రించాలన్నారు.


