News February 25, 2025

WGL: ఎత్తుకు పైఎత్తులు.. మిగిలింది ఒక్కరోజే!

image

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ప్రచారానికి ఒక్క రోజే మిగిలి ఉండటంతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక కొంతమంది తాయిలాలు పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా కొంతమంది అభ్యర్థులు రెండో ప్రాధాన్యత ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

Similar News

News November 11, 2025

మంచిర్యాల: వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు: కలెక్టర్

image

వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో ‘అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం- 2025’ గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ఈనెల 12 నుంచి 19 వరకు వృద్ధుల వారోత్సవాలు కొనసాగుతాయన్నారు. పోషణ, ఇతర ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నం.14567ను వృద్ధులు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.

News November 11, 2025

శంబర పోలమాంబ అమ్మవారి జాతర తేదీలు ఖరారు

image

ఉత్తరాంధుల ఇలవేల్పు, గిరిజనుల ఆరాధ్య దేవత శ్రీశంబర పోలమాంబ అమ్మవారి 2025-26 జాతర తేదీలు ఖరారు అయ్యాయి. ఆలయ ఈవో బి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది. వచ్చే జనవరి 26వ తేదీన తోలేళ్ల ఉత్సవం, 27న సిరిమానోత్సవం, 28న అనుపోత్సవ కార్యక్రమం జరగనుంది. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, ఆలయ ఛైర్మన్, ఉపసర్పంచ్, మాజీ ఛైర్మన్లు, గ్రామ పెద్దలు, సేవకులు, ఆశాదిలు, తదితరులున్నారు.

News November 11, 2025

మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 7రోజుల జైలు శిక్ష: SP

image

జామి పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం సేవించి స్కూటీ నడిపిన కొట్టాం గ్రామానికి చెందిన నక్కెళ్ల ఎర్రినాయుడుకు కోర్టు 7రోజులు జైలు శిక్ష విధించిందని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఈనెల 9న విసినిగిరి జంక్షన్ వద్ద వాహన తనిఖీల సమయంలో మద్యం తాగి స్కూటీ నడిపిన నిందితుడిని జామి పోలీసులు పట్టుకున్నారు. సాక్ష్యాధారాలతో కోర్టులో హాజరుపరిచిన తరువాత శిక్ష ఖరారైందన్నారు.