News March 26, 2025

WGL: క్రమంగా తగ్గుతున్న మొక్కజొన్న ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మక్కలు (బిల్టి) క్వింటాకి సోమవారం రూ. 2265 పలకగా.. మంగళవారం రూ.2,250 పలికింది. బుధవారం మరింత తగ్గి రూ.2245కి పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే సూక పల్లికాయ క్వింటాకు రూ.6050 ధర రాగా.. పచ్చి పల్లికాయకి రూ.4300 ధర వచ్చింది.

Similar News

News November 21, 2025

వాజేడు ఫారెస్ట్ రేంజర్ చంద్రమౌళి బదిలీ

image

వాజేడు ఫారెస్ట్ రేంజర్ చంద్రమౌళి బదిలీ అయ్యారు. ఐదేళ్లుగా విధులు నిర్వహించిన చంద్రమౌళిని అటవీ శాఖ ఉన్నతాధికారులు బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ మేరకు భూపాలపల్లి జిల్లాలోని చెల్పూరు రేంజికి ఆయన్ను బదిలీ చేయగా విధుల్లో చేరారు. ఆయన స్థానంలో ప్రస్తుతం వెంకటాపురం(కే) రేంజర్ వంశీకృష్ణకు వాజేడు రేంజర్ ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు.

News November 21, 2025

ప.గో: గుండెపోటు.. నడుస్తున్న రైలులోనే ప్రాణం పోయింది!

image

రాజమండ్రికి చెందిన 67 ఏళ్ల వనమా లక్ష్మి నడుస్తున్న రైలులో గుండెపోటుకు గురై మృతి చెందింది. తన కుమార్తె గృహప్రవేశం నిమిత్తం విజయవాడకు బయలుదేరిన ఆమెకు దారి మధ్యలో గుండెపోటు రావడంతో ఏలూరు రైల్వే స్టేషన్‌లో దించి వైద్యం అందించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై ఏలూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 21, 2025

విద్యార్థులకు ఉపశమనం.. రూ.161 కోట్ల బకాయిలు విడుదల

image

ఖమ్మం: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌ బకాయిలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధించిన రూ.161 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజాభవన్లో జరిగిన సమీక్షలో ఈ మేరకు సూచించారు. ఈ నిర్ణయంతో వేలాది మంది పేద విద్యార్థులకు, కళాశాలలకు ఆర్థికంగా ఊరట లభించనుంది.