News January 8, 2025
WGL: క్రమంగా తగ్గుతున్న మొక్కజొన్న ధర
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధర క్రమంగా, స్వల్పంగా తగ్గుతూ వస్తున్నది. మక్కలు(బిల్టీ) క్వింటాకు గతవారం రూ. 2570 పలకగా.. సోమవారం, మంగళవారంలు రూ.2,565 ధర పలికాయి. ఈరోజు మరింత తగ్గి రూ.2560 పలికింది. అలాగే కొత్త తేజ మిర్చికి నిన్న రూ.14,500 ధర రాగా నేడు రూ.14,900 పలికింది. కొత్త 341 రకం మిర్చికి నిన్నటి లాగే రూ. 14 వేలు పలికింది.
Similar News
News January 16, 2025
వరంగల్ మార్కెట్లో చిరుధాన్యాల ధరలు ఇలా!
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఈరోజు వివిధ రకాల చిరుధాన్యాలు తరలివచ్చాయి. పచ్చి పల్లికాయ క్వింటా ధర రూ.4300 పలకగా.. సూక పల్లికాయ ధర రూ.6210 పలికింది. అలాగే కందులు క్వింటాకు రూ.7003, బబ్బెర్లు రూ.7100, నల్లనువ్వులు రూ.11,500 పలికినట్లు రైతన్నలు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
News January 16, 2025
వరంగల్: జాతరల సీజన్.. మీరు ఎక్కడికి వెళుతున్నారు!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతరలు, ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కొత్తకొండ, ఐనవోలు, ఊరుగొండ ఆలయాలకు భక్తులు తరలి వెళ్తున్నారు. అన్నారం దర్గా ఉర్సు ఉత్సవాలు ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు జరగనన్నాయి. అంతేకాకుండా వచ్చే నెల 12 నుంచి మేడారం మినీ జాతర జరగనుంది. ఈ సందర్భంగా అధికారులు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. మరి మీరు ఎక్కడికి వెళుతున్నారో కామెంట్ చేయండి.
News January 16, 2025
నేటి నుంచి అన్నారం ఉర్సు ఉత్సవాలు
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం హజ్రత్ సయ్యద్ యాకుబ్ షావలి దర్గా ఉత్సవాలు గురువారం నుంచి ఘనంగా జరగనున్నాయి. ఈనెల 16న గంధం, 17న దీపారాధన, 18న ఖత్ మే ఖురాన్ ఉత్సవాలు జరగనున్నాయి. మత సామరస్యానికి ప్రతీకగా అన్నారం దర్గా నిలుస్తోంది. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉత్సవాలకు విచ్చేస్తుంటారు. మీరూ ఉర్సు ఉత్సవాలకు వెళ్తే కామెంట్ చేయండి.