News April 10, 2025

WGL: క్రమంగా పెరుగుతున్న పత్తి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,405 పలకగా.. మంగళవారం రూ.7,355, బుధవారం రూ.7,400 పలికాయి. అలాగే నేడు (గురువారం) మరింత పెరిగి రూ.7,425కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. ఈరోజు మార్కెట్‌కు పత్తి తరలిరాగా క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

Similar News

News November 21, 2025

హనుమకొండ: ముగిసిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

image

హనుమకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో పది రోజులపాటు నిర్వహించిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ విజయవంతంగా ముగిసింది. డీడీజీ( స్టేట్స్), జోనల్ రిక్రూటింగ్ ఆఫీస్ చెన్నై, డైరెక్టర్ రిక్రూటింగ్ ఏఆర్ఓ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో పది రోజులపాటు రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు ఆర్మీ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులు కాగా జేఎన్ఎస్‌లో ఫిజికల్ ఫిట్ నెస్ నిర్వహించారు. ఆర్మీ అధికారులు కలెక్టర్‌ను కలిశారు.

News November 21, 2025

మూవీ ముచ్చట్లు

image

* ప్రభాస్ చాలా సున్నిత మనస్కుడు.. ఐ లవ్ హిమ్: అనుపమ్ ఖేర్
* DEC 5న జీ5 వేదికగా OTTలోకి ‘ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ
* ‘కొదమసింహం’ రీ రిలీజ్.. వింటేజ్ చిరును చూసి ఫ్యాన్స్ సంబరాలు
* కిచ్చా సుదీప్ మహిళలను కించపరిచారంటూ కన్నడ బిగ్‌బాస్ సీజన్-12పై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
* జైలర్-2 తర్వాత తలైవా 173కి కూడా నెల్సన్ దిలీప్ కుమారే డైరెక్టర్ అంటూ కోలీవుడ్‌లో టాక్

News November 21, 2025

వనపర్తి: ‘స్నేహపూర్వక పోలీసింగ్’తో ఎస్పీకి ప్రత్యేక ముద్ర.!

image

వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సేవలు చిరస్మరణీయమని చెప్పవచ్చు. ఆయనను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వనపర్తి జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు, పోలీసు విభాగానికి కొత్త దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ‘స్నేహపూర్వక పోలీసింగ్’ విధానంతో ప్రజల నుంచి నేర సమాచారం సేకరించడంలో ప్రత్యేక చొరవ చూపారు.